Ladakh Army Personnel Dead: లడఖ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం లోయలో పడటంతో 9 మంది జవాన్లు అమరులయ్యారు. దక్షిణ లడఖ్‌లోని నియోమా జిల్లాలోని ఖేరి సమీపంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని పరిశీలించింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కారు గ్యారిసన్ నుంచి లేహ్ లోని ఖేరికి ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తుంటే వారి వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు సమాచారం. 


లేహ్ నుంచి న్యోమాకు సైనికులతో వెళ్తున్న ALS వాహనం శనివారం సాయంత్రం 5:45-6:00 గంటల ప్రాంతంలో లోటలో పడటంతో విషాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని ఓ వాహనం కియారీకి 7 కిలోమీటర్ల సమీపంలో ఉండగా ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఇందులో మొత్తం 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నారని, వారిలో తొమ్మిది మంది మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ సిబ్బందిని వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు.