AI Teacher Iris in Kerala: విద్యారంగంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు AI టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలి AI టీచర్‌ Iris తో పాఠాలు బోధిస్తోంది. Makerlabs Edutech Private Limited ఈ AI రోబోని తయారు చేసింది. తిరువనంతపురంలోని KTCT Higher Secondary Schoolలో ఈ హ్యూమనాయిడ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలకు ఈ AI టీచర్ పాఠాలు చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.  "ఐరిస్ హ్యూమనాయిడ్‌తో విద్యారంగంలో కొత్త మార్పులు తీసుకొచ్చాం. విద్యాబోధనా విధానాన్ని పూర్తిస్థాయిలో మార్చేసే విధంగా AI టెక్నాలజీని వినియోగించాం" అని మేకర్‌ల్యాబ్స్ సంస్థ వెల్లడించింది. విద్యార్థులతో ఇంటరాక్ట్ అవడం నుంచి  పాఠాలు చెప్పడం వరకూ అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన  Atal Tinkering Lab (ATL) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ AI టీచర్‌ని తయారు చేశారు. మొత్తం మూడు భాషల్లో మాట్లాడేస్తుంది. ఎంత కష్టమైన ప్రశ్నలకైనా సులువుగా సమాధానం చెబుతుంది. వాయిస్ అసిస్టెన్స్, ఇంటరాక్టివ్ లెర్నింగ్ మాడ్యూల్స్ లాంటి ఫీచర్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అన్ని తరగతి గదుల్లోకి తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడుతోంది ఈ ఐరిస్ హ్యూమనాయిడ్. వాయిస్ అసిస్టెంట్‌ మాడ్యూల్‌ తయారీలో  Robotics and Generative AI టెక్నాలజీస్ తోడ్పాటునందించింది. ఇంటెల్ ప్రాసెసర్‌తో తయారు చేశారు. 






మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల (Satya Nadella) కీలక ప్రకటన చేశారు. 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ స్కిల్స్‌పై యువతకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 20 లక్షల మంది విద్యార్థులకు AI స్కిల్క్‌పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌తో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించినట్టవుతుందని వివరించారు. ముంబయిలో జరిగిన Microsoft CEO Connection ఈవెంట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమయంలోనే AI స్టార్టప్‌ Karya సంస్థపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లోని 30 వేల మందిని ఎంపిక చేసింది ఈ కంపెనీ. స్పీచ్, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ ద్వారా డేటా సెట్స్‌ని తయారు చేసేందుకు వీళ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. అంతే కాదు. వాళ్లకు కొంత వేతనమూ చెల్లించింది. మొత్తం 12 భారతీయ భాషలకు సంబంధించిన డేటాసెట్స్‌ని రూపొందించనుంది. ప్రభుత్వానికి సహకరించేందుకు తయారు చేసిన GenAI చాట్‌బోట్‌ Jugalbandhi గురించీ ప్రస్తావించారు సత్య నాదెళ్ల. దీంతో పాటు Bhashini లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ గురించీ మాట్లాడారు. జుగల్‌బందీ చాట్‌బోట్‌ని భాషిణి ట్రాన్స్‌లేట్‌ టూల్‌ని కలిపి వినియోగించుకుంటే మారుమూల గ్రామాల్లో రకరకాల భాషలు మాట్లాడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల GDP లక్ష్యంగా పెట్టుకుందన్న సత్యనాదెళ్ల ఆ సమయానికి AI టెక్నాలజీదే 500 బిలియన్ డాలర్ల వాటా ఉంటుందని అంచనా వేశారు.


Also Read: బెంగళూరు బాంబు పేలుడు కేసు - నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నజరానా