Elevator Collapses in Ahmedabad: ఏడో అంతస్తు నుంచి కింద పడిన లిఫ్ట్- ఏడుగురు కూలీలు మృతి

ABP Desam   |  Murali Krishna   |  14 Sep 2022 05:30 PM (IST)

Elevator Collapses in Ahmedabad: గుజరాత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో లిఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

ఏడో అంతస్తు నుంచి కింద పడిన లిఫ్ట్- ఏడుగురు కూలీలు మృతి

Elevator Collapses in Ahmedabad: గుజరాత్‌ అహ్మదాబాద్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న యాస్పయిర్-2 భవంతిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ కుప్పకూలి ఏడుగురు కూలీలు మృతి చెందారు.

ఏడో అంతస్తు నుంచి

గుజరాత్ యూనివర్శిటీకి సమీపంలో ఈ భవన నిర్మాణం సాగుతోంది. ఏడో అంతస్తు నుంచి ఈ  లిఫ్ట్ ఒకేసారి కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. 

మున్సిపల్ కార్పొరేషన్ నియమ నిబంధలను బిల్టర్లు ఉల్లంఘించారా అనేది తెలుసుకుంటున్నాం. తప్పుడు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చి ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.                  - కేజే పర్మార్,  మేయర్

ఈ ఘటన తెల్లవారుజామున జరిగినప్పటికీ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పోలీసులకు బిల్డర్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. లిఫ్ట్ కుప్పకూలిన సమయంలో అందులో ఎనిమిది మంది కార్మికులు ఉన్నట్టు చెబుతున్నారు.

ప్రధాని సంతాపం

ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

అహ్మదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన దుర్ఘటన బాధాకరం. ఈ దుర్ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు                                      -  ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: Air India Flight: ఎయిర్ ఇండియా విమానంలో అగ్ని ప్రమాదం- భయంతో ప్రయాణికులు పరుగు!

Also Read: Queen Elizabeth II Funeral: క్వీన్ ఎలిజబెత్- 2 అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published at: 14 Sep 2022 05:23 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.