Ghaziabad Murder: పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం- ఇటుక బెడ్డతో దాడి, ఒకరు మృతి!

ABP Desam Updated at: 26 Oct 2022 03:50 PM (IST)
Edited By: Murali Krishna

Ghaziabad Murder: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తిపై ఇటుక బెడ్డతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

NEXT PREV

Ghaziabad Murder: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఘజియాబాద్‌లో రోడ్డు పక్కన పార్కింగ్ చేయడంపై చెలరేగిన వాగ్వాదం కొంతమంది మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఇటుక బెడ్డతో కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు


ఇదీ జరిగింది


ఘజియాబాద్‌లో మంగళవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్‌ షాప్ వద్ద పార్కింగ్ విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇది చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరొకరి తలపై ఇటుక బెడ్డతో గట్టిగా కొట్టాడు. దీంతో బాధితుడు (35) కుప్పకూలిపోయాడు.






పడిపోయిన బాధితుడిపై మళ్లీ ఇటుక బెడ్డతో దాడి చేస్తోన్న సమయంలో అటుగా వెళ్తోన్న వాహనదారుడు ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 


దర్యాప్తు


ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదు బృందాలు నిందితుల కోసం వెతుకుతున్నాయని ఘజియాబాద్ పోలీసులు తెలిపారు.







అక్టోబర్ 25న లోని రోడ్‌లో హాబ్స్ కిచెన్ ముందు రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరొక వర్గానికి చెందిన వ్యక్తిని ఇటుకతో కొట్టారు. అతడ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయి.                   -    జీకే సింగ్‌, నగర అదనపు ఎస్పీ 


Also Read: Ashok Gehlot On Rahul Gandhi: ఆయనే కరెక్టు- ఇంకెవురివల్లా కాదు: అశోక్ గహ్లోత్

Published at: 26 Oct 2022 03:50 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.