Rajnath Singh Statement: 'మన సైనికులు ఎవరూ చనిపోలేదు- చైనాను బలంగా తిప్పికొట్టాం'

ABP Desam   |  Murali Krishna   |  13 Dec 2022 12:51 PM (IST)

Rajnath Singh Statement: చైనా- భారత్ సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు.

(Image Source: ANI)

Rajnath Singh Statement: భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. లోక్​సభలో ప్రకటన చేశారు. చైనా దళాల దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుందన్నారు. 

డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు భారత్ తెలిపింది. మన సరిహద్దులను కాపాడేందుకు మన బలగాలు కట్టుబడి ఉన్నాయి. దానిని సవాలు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని నేను సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను.                                 -     రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి

సురక్షితంగా

డిసెంబర్ 9న జరిగిన ఘర్షణలో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది.                                   -     రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి

Also Read: India-China Faceoff: భారత్- చైనా సరిహద్దులో టెన్షన్ టెన్షన్- రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్

Published at: 13 Dec 2022 12:47 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.