Chhattisgarh:   చత్తీస్ గఢ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు కొంత మంది నిరుద్యోగ యువకులు నగ్న నిరసన చేపట్టారు. ఈ వ్యవహారం సంచలనం అయింది.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో నకిలీ కుల ధృవీకరణ పత్రాల సమస్యను వెలుగులోకి తీసుకురావడానికి యువకులు బట్టలు లేకుండా వీధుల్లోకి వచ్చి నగ్నంగా నిరసన తెలిపారు.  తమ నిరసనను అధికారంలో ఉన్నవారు గుర్తిస్తారనే ఆశతో రోడ్డుపై నగ్నంగా నిరసన తెలుపుతున్న యువకులు ఏదైనా వీవీఐపీ వాహనాల వెంట పరిగెత్తారు.  ప్లకార్డులతో పరిగెత్తుతూ వీవీఐపీ కార్లను అనుసరిస్తూ   అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు.

  



నకిలీ ధృవపత్రాలతో పెత్త ఎత్తున ఇతరులు ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు 





నకిలీ కుల ధృవీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కొత్తదేమీ కానప్పటికీ రాష్ట్రంలో ఇలాంటి నిరసన చేపట్టడం ఇదే తొలిసారి. నిరసనలో పాల్గొన్న యువకులు చేతిలో ప్లకార్డులు పట్టుకుని, ఒంటిపై బట్టలు లేకుండా వీధుల్లో నడుస్తూ కనిపించారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
 


ఇప్పటికే కొంత మంది ఇలా ఉద్యోగాలు పొందిన వారు సస్పెండ్ 


చత్తీస్ గఢ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నకిలీ కుల ధృవీకరణ పత్రం జారీ అవుతున్నాయి.  చత్తీస్ గఢ్ లో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఉపయోగించే నకిలీ కుల ధృవీకరణ పత్రం వ్యవహారం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2021 సంవత్సరంలో, నకిలీ షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) కుల ధృవీకరణ పత్రాన్ని ఉపయోగించినందుకు పిడబ్ల్యుడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను సస్పెండ్ చేశారు.  


విచారణ జరిపి న్యాయం చేయాలంటున్న నిరుద్యోగులు        


ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు ఉపయోగించే నకిలీ కుల ధృవీకరణ పత్రంపై నిరసన తెలుపుతున్న వారు పదేపదే డిమాండ్ చేసినా ఆ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇలాంటి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని ఆరోపిస్తున్నారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నవారు అర్హత లేకుండానే ఉద్యోగంలో అన్ని సౌకర్యాలు పొందుతున్నారని, అయినా అలాంటి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర కమిషన్ నిరాకరిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. 


ఈ  అంశంపై చత్తీస్ ఘడ్‌లో నిరుద్యోగుల పోరాటం దేశాన్ని ఆకర్షిస్తోంది.   నగ్నంగా చేసిన నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.