Bengaluru News: భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు ఉళ్లాల ఎంవీ లేఔట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 


ఇదీ సంగతి 


బెంగళూరుకు చెందిన మహేశ్వర(25)కు మూడు నెలల క్రితం కవన అనే యువతితో వివాహమైంది. అయితే పెళ్లయిన దగ్గర నుంచి కవన తరచూ భర్తతో గొడవ పడేదని స్థానికులు తెలిపారు. ఆమె వేధింపులు తట్టుకోలేక మహేశ్వర ఐదు రోజుల క్రితం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్య వేధింపులు తట్టుకోలేకే మహేశ్వర ఆత్మ హత్య చేసుకున్నట్లు అతని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. 


Also Read: Kashmir Remark in UN: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్- ఐరాసలో మాటల యుద్ధం