Andhra Pradesh Latest News - 'నా విజయానికి టీటీడీపీ శ్రేణులు కృషి చేశారు' - తెలంగాణ గడ్డపై టీడీపీకి పునఃవైభవం వస్తుందన్న ఏపీ సీఎం చంద్రబాబు - ఏపీలో తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు (NTR Bhavan) ఆయన ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీటీడీపీ ఆధ్వర్యంలో  జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులకు (Ration Cards) సంబంధించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. శనివారం నుంచి ఎడిట్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. మరోవైపు, ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల జారీపైనా కసరత్తు చేస్తోంది. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు కావాలనుకునే వారు మీ సేవా కేంద్రాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


జగన్‌పైకి అతను ఎందుకు దూసుకొచ్చాడు? దాడి చేయడానికా? అసలు నిజం చెప్పిన వ్యక్తి
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) వైఎస్ఆర్ జిల్లా పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కడప (Kadapa) రిమ్స్ ఆస్పత్రిలో పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రభుత్వం  ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8 (సోమవారం) నుంచి ఉచితంగా ఇసుకను అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేయగా.. అందుకు అనుగుణంగా జిల్లాల యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముందుగా అన్ని చోట్లా స్టాక్ ఉన్న కేంద్రాల్లో ఇసుక డంప్‌ల నుంచి ఉచితంగా ఇసుకను అందిస్తుంది. ఇందుకోసం రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. అయితే, నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు రూ.20, సీనరేజ్ కింద టన్నుకు రూ.88 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
మణికొండ కేవ్ పబ్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. పబ్ లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వీకండ్ మత్తులో తేలడానికి పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సైకడిక్ట్ పార్టీలో 80 డెసిబుల్స్ సౌండ్ మించి శబ్దంతో డీజే గౌరవ్ హోరెత్తించారు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసి విక్రయించినట్లు పోలీసులు తేల్చారు. పట్టుబడ్డ వారంతా రెండు రోజులుగా డీజే ఆర్టిస్ట్ గౌరవ్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి