దులుతున్న రైలు కిందపడితే ఏమవుతారు? చనిపోతారు లేదా అవయవాలను కోల్పోతారు కదా. కానీ, ఈ యువతికి ఈ భూమి మీద నూకలున్నాయ్. అందుకే, రైలు కిందపడినా స్వల్ప గాయాలతో తప్పించుకుంది. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవుతారు. ఆమె నేరుగా ప్లాట్‌ఫామ్ మీద నుంచి రైలు బోగీల మధ్య ఉండే సంధులో పడిపోయినా ప్రాణాలతో ఉండటం చూస్తే ఆశ్చర్యపోతారు. 


అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాండెల్లా అనే యువతి రైలు కోసం ప్లాట్‌ఫామ్ మీద నిలబడి ఉంది. ఇంతలో ఓ రైలు అటుగా వచ్చింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో ఆమె అడుగులు తడబడ్డాయి. నేరుగా కదులుతున్న రైలు బోగీల వైపుకు కదిలింది. రెప్పపాటు వ్యవధిలో రెండు బోగీల మధ్య ఉండే గ్యాప్ మధ్య పడిపోయింది. దీంతో వెంటనే రైలును ఆపేశారు. ఆ దృశ్యం చూసి చాలామంది ఆమె చనిపోయిందనే అనుకున్నారు. కానీ, ఆమె బతికే ఉంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


 ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు.. ఆమె చనిపోతుందని భావించామని, నిజంగా అద్భుతం జరిగిందని, ఆమె మళ్లీ పుట్టిందని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియోను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేయడంతో నెట్టింట కూడా చక్కర్లు కొట్టింది. ఈ వీడియో చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చాలా అదృష్టవంతురాలని అంటున్నారు.






అయితే, ఆమె అకస్మాత్తుగా అలా వింతగా ఎందుకు కదిలింది? నేరుగా కదులుతున్న రైలు వైపు ఎలా కదిలిందనేదే ఎవరికీ అంతు చిక్కడం లేదు. చూస్తుంటే ఇది ఆత్మహత్యలా లేదని, ఏదో అనారోగ్య సమస్య వల్లే ఆమె అలా కదిలి ఉంటుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆగ్రాలోని రాజా కి మండీ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ కానిస్టేబుల్ ఈ విధంగానే రైలు కిందపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడు కూడా రైలు కిందపడే ముందు గాల్లో ఏదో చూస్తూ గుండ్రగా తిరిగాడు. 






Also Read: వైరల్ వీడియో - గాల్లో ఏదో చూశాడు, గిరగిరా తిరుగుతూ రైలు కిందపడ్డాడు, అసలేం జరిగింది?


Also Read: స్మార్ట్ ‘బొద్దింకలు’ - మనుషులను రక్షిస్తాయ్, చెప్పిన పని చేస్తాయ్! ఇదిగో ఇలా