National Pollution Control Day 2025 : భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, వాతావరణ ముప్పులు, ఆరోగ్య ప్రమాదాలు, తరచుగా జరిగే పర్యావరణ సంఘటనలపై అవగాహన కల్పిస్తూ దీనిని నిర్వహిస్తున్నారు. విషపూరితమైన గాలి, కలుషిత నీరు, వ్యర్థాల సమస్యలతో పోరాడటాన్ని ఇది హైలెట్ చేస్తుంది. పర్యావరణ ప్రాముఖ్యతను చెప్తూ ప్రతి ఏటా  జరుపుతున్నారు. ప్రాణాలను రక్షించడానికి, పరిశుభ్రమైన అలవాట్లతో పాటు మరెన్నో అవలంబించడానికి ఇది పిలుపునిస్తుంది. మరి దీనిని ఇండియాలో నిర్వహించడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రాముఖ్యతలు, ఇంట్రెస్టింగ్ విషయాలు గురించి ఇప్పుడు చూసేద్దాం.

Continues below advertisement

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ చరిత్ర

భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇది 1984 నాటి దేశంలోని అత్యంత విషాదకరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ విషాదాన్ని గుర్తుచేస్తుంది. ఇప్పుడు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL)గా పేరుపొందిన.. పురుగుమందుల కర్మాగారంలో విషపూరిత వాయువు లీక్ అయింది. దీని ఫలితంగా వేలాది మంది మరణించగా.. లెక్కలేనంత మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వచ్చింది.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ.. పర్యావరణ భద్రత, ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం డిసెంబర్ 2ని జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా గుర్తించింది. పారిశ్రామిక నిర్లక్ష్యం, పేలవమైన పర్యావరణ నిర్వహణ, వినాశకరమైన పరిణామాలను ఈ రోజు గుర్తు చేస్తుంది. పౌరులు, పరిశ్రమలు కాలుష్య నివారణపై స్థిరమైన పద్ధతులు, పర్యావరణ నిబంధనల గురించి అవగాహన కల్పించే వేదికగా మారింది.

Continues below advertisement

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం 2025 ప్రాముఖ్యత

ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో కొన్ని భారతదేశంలో ఉన్నాయి. ఇది పర్యావరణ అవగాహనను చాలా కీలకం చేస్తుంది. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం దీనికి ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా కాలుష్య ప్రమాదాలపై ప్రజల అవగాహనను పెంచుతారు. మెరుగైన భద్రత, వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అవలంబించేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తారు. పర్యావరణ పరిరక్షణలో పాల్గొనడానికి పౌరులను ప్రేరేపించడం వంటివి దీని ప్రాముఖ్యతను హైలెట్ చేస్తున్నాయి. గాలి నాణ్యత, ఆందోళనలు, వాతావరణ మార్పులు, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలను ఇది హైలెట్ చేస్తుంది.

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం 2025వ థీమ్

జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్తో వస్తుంది. ఈ ఏడాది "ఆకుపచ్చ భవిష్యత్తు కోసం స్థిరమైన జీవనం." ఇది కేవలం విధాన సంస్కరణల కంటే జీవనశైలి మార్పును కోరుకుంటుంది. సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లను తగ్గించడం, వ్యర్థాలను తగ్గించడం, ఆకుపచ్చ రవాణాను ప్రోత్సహించడం, పర్యావరణ స్పృహ గల బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వడాన్ని ఇది హైలెట్ చేస్తుంది. కాలుష్యానికి వ్యతిరేకంగా భారతదేశ పోరాటం ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, ప్రతిరోజు చేసే ఎంపికల ద్వారానే పరిశుభ్రమైన భవిష్యత్తు అందుతుందని చెప్తుంది.

దృష్టి సారించాల్సిన అంశాలు ఇవే

  • గాలి నాణ్యత నిర్వహణ : కఠినమైన పర్యవేక్షణ, త్వరిత ప్రతిస్పందన విధానాలు అమలు పరచాలి.
  • వ్యర్థాల తగ్గింపు : రీసైక్లింగ్, బాధ్యతాయుతమైన వ్యర్థాలు పారవేయడాన్ని ప్రోత్సహించాలి.
  • పారిశ్రామిక భద్రత : రసాయన ప్రమాదాలను నివారించడానికి అప్‌గ్రేడ్ ప్రోటోకాల్‌లు ఫాలో అవ్వాలి.
  • ఆకుపచ్చ సాంకేతికత : సౌర, జీవ ఇంధనం, విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలి.
  • ప్రజా భాగస్వామ్యం : భారీ అవగాహనపై ప్రచారాలు, పాఠశాలల భాగస్వామ్యం అయ్యేలా చూసుకోవాలి.

2025 థీమ్ ప్రతి పౌరునికి వ్యక్తిగత పిలుపుగా పనిచేస్తుంది. ఇది పెద్ద-స్థాయి విధానం నుంచి చిన్న, తక్షణ వ్యక్తిగత చర్యలకు మారుతుంది. ఇవి భారతదేశ పర్యావరణ ఆరోగ్యాన్ని సమష్టిగా మార్చగలవు. ప్రజా రవాణాను ఉపయోగించడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం లేదా చెట్లు నాటడం వంటివి కావచ్చు. ఈ థీమ్ రేపటికి మార్గం సుగమం చేసే జీవనశైలిగా మారుతుందేమో చూడాల్సి ఉంది.