World Earth Day Theme is Planet vs Plastics : భూమి, ప్రకృతి, పర్యావరణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరత్రి దినోత్సవం(World Earth Day 2024) జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్లాస్టిక్​ను అంతం చేయాలనే లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ థీమ్​ ప్రధాన అజెండా ఏమిటి? అసలు ఈ వరల్డ్ ఎర్త్​ డేని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారంటే..


యూఎస్​కు చెందిన సెనేటర్ గేలార్డ్ నెల్సన్ పర్యావరణ సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఎర్త్​ డేని ప్రారంభించాడు. పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు మద్దతుగా ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్​డేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1970లో యూఎస్​లో దీనిని మొదటిసారి నిర్వహించారు. అప్పటినుంచి 192 దేశాలలో బిలియన్ కంటే ఎక్కువ మంది ఈ ఎర్త్​ డే నిర్వహిస్తున్నారు. 2016లో ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 22వ తేదీన పారిస్ ఒప్పందానికి ఈ సంతకం చేసింది. దీనిని వాతావరణం, పర్యావరణ ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఒప్పందంగా పరిగణిస్తారు. 


ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ థీమ్​తో..


గ్లోబల్ వార్మింగ్​కు వ్యతిరేకంగా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని ఆమోదించడానికి 196 దేశాల నాయకులు ఆ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఒకచోట చేరారు. ఒప్పందం ప్రకారం ఈ దేశాలు గ్లోబల్ వార్మింగ్​ను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్​కు పరిమితం చేయాలని భావిస్తున్నాయి. అయితే గ్రీన్​హౌస్​ వాయు ఉద్గారాలు 2025కి ముందు గరిష్ట స్థాయికి చేరుకోవాలి. 2030 నాటికి ఇవి 43 శాతం తగ్గించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ సంవత్సరం ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అనే గ్లోబల్ థీమ్​తో ముందుకు వచ్చారు. ప్రపంచ ధరత్రి దినోత్సవంలో భాగంగా గూగుల్ కూడా తన డూడుల్​ని మార్చింది. ప్రతి సంవత్సరం వివిధ రకాల డూడుల్స్​తో ముందుకు వస్తోంది గూగుల్.


2022 నుంచి ఈ థీమ్​ని ఫాలో అవుతున్నారు..


 గ్లోబల్ వార్మింగ్​కు ప్లాస్టిక్​ ప్రధాన కారణమవుతున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇవి భూమిలో కలిసిపోకుండా.. ప్రకృతికి ఇబ్బంది కలిగిస్తున్నాయని పెద్ద ఎత్తున వాదనలు రావడంతో ఈ వినియోగాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్​పై విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యాపారులు, ప్రభుత్వాలు, NGOలు కలిసి ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా ముందుకు వెళ్లేలా చూస్తున్నారు. 2040 నాటికి 60 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తులను తగ్గించేలా చర్యలు తీసుకుంటారు. 20240 నాటికి ప్లాస్టిక్​లు లేని, రాబోయే తరాలకు ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని.. అధికారిక ఎర్త్​డే వెబ్​సైట్​లో రాసుకొచ్చారు. ఈ థీమ్​ని 2022 నుంచి కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడంపై దృష్టిని సారిస్తున్నారు. 



ప్లాస్టిక రహిత భూమే ప్రధాన లక్ష్యం


2040 నాటికి అన్నిరకాలుగా ప్లాస్టిక్ ఉత్పత్తిని 60 శాతం తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. మానవ, భూమి, పర్యావరణ పరిరక్షణ కోసం పాస్టిక్​ను అంతం చేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. ఈ థీమ్​పై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించేలా చేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్​లను తొలగించడం, ప్లాస్టిక్ వాడకంపై నిషేదాన్ని విధించేలా చేయడం వంటి డిమాండ్స్​ ఈ థీమ్​లో ఉన్నాయి. రాబోయే తరాలు ప్లాస్టిక్ రహిత భూమిని అందించడమే ఎర్త్​ డే ప్రధాన లక్ష్యం.


Also Read : అతని వయసు 61.. కానీ బయోలాజికల్ ఏజ్​ 30ల్లోనే ఉంది.. అది ఎలా సాధ్యమైందంటే