Onions: ఇప్పుడు అన్నింటికీ మందులు వచ్చాయి. సిరప్‌లు, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఇంటి చిట్కాలనే పాటించి అనారోగ్యాలను తగ్గించుకునేవారు. అలా పూర్వకాలంలో జలుబుకు, జ్వరానికి ఉల్లిపాయతో చికిత్స చేసేవారట. ఉల్లిపాయ ముక్కలను సాక్సులు లేదా వస్త్రాలలో చుట్టి పాదాలకు వేసుకోవడం లేదా కట్టుకోవడం చేసేవారు. అలా రాత్రంతా ఉంచుకుని నిద్రపోయే వారు. ఉదయానికి వారి ఆరోగ్యంలో చాలా మెరుగుదల కనిపించేదట. ఇది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా, ఇది పనిచేస్తుందని నమ్మే అమ్మమ్మలు, తాతయ్యలు ఎంతోమంది. అదొక సాంప్రదాయ ఔషధంగా చెప్పుకుంటారు. 


ఎప్పుడు పాటించేవారు?
ఇలా ఉల్లిపాయలతో జలుబును, జ్వరాన్ని తగ్గించుకునే ప్రాచీన పద్ధతిని 1500 వ శతాబ్ధంలో పాటించేవారు. ఆ సమయంలో ప్రపంచం ప్రాణాంతకమైన బుబోనిక్ ప్లేగుతో సహా అనేక వ్యాధులతో పోరాడుతోంది. వాటన్నింటినీ నయం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉన్నట్టు అప్పటి వైద్యులు నమ్మేవారు. నేషనల్ అసోసియేషన్ ప్రకారం, విషపూరిత గాలి ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఉల్లిపాయల నుంచి వచ్చే ఘాటైన వాసన గాలిలో కలిసి అందులోని విషపూరిత ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. అందుకే పూర్వం ఉల్లిపాయలను ఔషధంగా పరగణించేవారు. సాక్సుల్లో ఉల్లిపాయల ముక్కలు పెట్టుకునే నమ్మకం అధికంగా పాశ్చాత్యదేశాల్లో ఉండేది. అయితే ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని నమ్మేవారు. ఇది సహజంగానే శరీరాన్ని శుభ్రపరుస్తుందని నమ్ముతారు. రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. 


చైనాలో కూడా ఈ నమ్మకం ఉంది. చైనీయుల నమ్మకం ప్రకారం శరీరంలోని ముఖ్యమైన అవయవాల నరాలు పాదాలకు అనుసంధానించి ఉంటాయి. ఉల్లిపాయలను పాదాల దగ్గర ఉంచడం వల్ల శరీరంలోని అంతర్గత రోగాలు నయం అవుతాయని వారి నమ్మకం. ఈ నమ్మకాలకు ఆధారాలు ఉండవు. సైన్సు మాత్రం ఆధారాలనే అడుగుతుంది. ఇంతవరకు ఏ అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు, కానీ ఉల్లిపాయల్లో సల్ఫర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయని, గొప్ప యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయని నమ్ముతారు. అందుకే వాటి వల్ల ఆరోగ్యానికే మంచే జరుగుతుందని చెప్పాయి అధ్యయనాలు. 


అలా ఉంచడం వల్ల ఆరోగ్యమే....
ఉల్లిపాయలను పాదాల కింద గుంతల్లో పెట్టుకుని సాక్సు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికైతే లాభమే కలుగుతుంది. జలుబు, జ్వరం వంటివి తగ్గుతాయో లేదో మాత్రం చెప్పలేం. ఉల్లిపాయలు ఫాస్పోరిక్ యాసిడ్ ను కలిగిఉంటాయి. దీన్ని మనిషి శరీరానికి తాకేలా ఉంచడం వల్ల వేడి పుట్టి ఆ ఫాస్పోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. ఇది సెమిపెర్మెబుల్ పొర ద్వారా రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. సిరల గుండా ప్రవేశించి రక్తాన్ని శుద్ది చేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. 


Also read: ఉప్పును ఆహారంపై చల్లుకుని తినేవారికి ఇదే హెచ్చరిక, అది ముందస్తు మరణానికి కారణం కావచ్చు


Also read: రోజుకో గ్లాసు రాగిజావ తాగితే మధుమేహం నియంత్రణలో ఉండడం ఖాయం