Stock Market Opening Bell 14 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు అందకపోవడంతో సూచీల్లో బలం కనిపించడం లేదు. మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 57 పాయింట్ల లాభంతో 16,070, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 175 పాయింట్ల లాభంతో 53,688 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,514 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,6888 వద్ద లాభాల్లో మొదలైంది. 53,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,861 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 175 పాయింట్ల లాభంతో 53,688 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 15,966 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,018 వద్ద ఓపెనైంది. 15,993 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,070 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 57 పాయింట్ల లాభంతో 16,070 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 34,817 వద్ద మొదలైంది. 34,753 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,027 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 24 పాయింట్ల లాభంతో  34,852 వద్ద ఉంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్‌టీపీసీ, యూపీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ, ఐటీ సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి.