Summer Health Tips for BP, Sugar, and Asthma Patients : ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని విషయాలు అస్సలు విస్మరించవద్దని సూచిస్తున్నారు నిపుణులు. మధుమేహమున్నవారు, బీపీ పేషెంట్లు, ఆస్తమా రోగులు సమ్మర్​లో కొన్ని విషయాల పట్ల కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 


బీపీ పేషెంట్లు.. 


రక్తపోటు సమస్యలున్నవారు సమ్మర్​లో కొన్ని సూచనలు రెగ్యులర్​గా ఫాలో అవ్వాలి. ఇవి బీపీ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. అవేంటంటే.. 


హైడ్రేషన్ : శరీరం డీహైడ్రేషన్ కాకుండా.. నీళ్లు తాగాలి. ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాలి. ఇది శరీరంలో బీపీని కంట్రోల్ చేసి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.


ఒత్తిడి : ఎండకాలంలో వేడి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతల వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో (ఉదయం 10-సాయంత్రం 4) ఇంట్లో ఉంటే మంచిది. ఫ్యాన్, ఏసీ వంటి కూలింగ్ పరికరాలు ఉపయోగించుకోవాలి. 


చెకప్స్ : రక్తపోటు ఎంత ఉందో రోజూ చెక్ చేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా మందులు, జీవనశైలి అలవాట్లు సర్దుబాటు చేసుకోవాలి.


డైట్​లో : వేడిని దూరం చేసి.. బీపిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. దోసకాయలు, సెలరీ, పెరుగు వంటి ఫుడ్స్ డైట్​లో తీసుకుంటే మంచిది. ఇవి వేడిని తగ్గించడంతో పాటు.. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. 


మధుమేహమున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


హైడ్రేషన్ : ఎండవేడిని తట్టుకునే శక్తిని శరీరానికి అందించేలా నీటిని తాగుతూ ఉండాలి. ఇది డీహైడ్రేషన్​ని తగ్గిస్తూ.. షుగర్ లెవెల్స్​ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 


ఆ డ్రింక్స్ వద్దు : ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రేషన్ కోసం షుగర్ డ్రింక్స్ తీసుకుంటారు. జ్యూస్ సోడా, టీ వంటివి డీహైడ్రేషన్​ని పెంచి.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. 


చెకప్స్ : బ్లడ్​లో షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో రెగ్యులర్​గా చెక్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా లైఫ్​స్టైల్, ఫుడ్స్ మార్చుకోవాలి. మందులు తప్పకుండా ఉపయోగించాలి. 


డైట్​ : ఫుడ్​ని ఒకేసారి కాకుండా.. తక్కువగా ఎక్కువసార్లు తినాలి. తీసుకునే కేలరీలను లెక్కించి.. దానిని డివైడ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. 


ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


బయటకి వెళ్లొద్దు : ఉదయాన్నే 5 నుంచి 10వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఆ సమయంలో ఆస్తమా రోగులు అలెర్జీలకు ఎక్కువగా గురి అవుతారు. కాబట్టి ఉదయాన్నే బయటకి వెళ్లకపోవడమే మంచిది. 


ఏసీలు : అలెర్జీలు, కాలుష్య కారకాలను ఫిల్టర్​ చేయడంలో హెల్ప్ చేసే ఎయిర్ కండీషనర్​లు ఉపయోగిస్తే మంచిది. ఇంట్లో, కారులో ఇవి ఉండేలా చేసుకోండి. 


ఆ పనులు వద్దు : ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకండి. వాటివల్ల ఉబ్బసం లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో శారీరక శ్రమను పరిమితం చేయాలి. 


ఇన్​హేలర్ : ఎక్కడికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఇన్​హేలర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. వైద్యులు సూచించిన సలహాలు ఫాలో అవ్వాలి. 


మరిన్ని జాగ్రత్తలు 


బయటకు వెళ్లినప్పుడు తేలికగా ఉండే, లూజ్ ఫిట్టింగ్ ఉండే దుస్తులు ధరించండి. టోపీలు, సన్​గ్లాసెస్​ ఉపయోగించడం వల్ల ఎండవేడిని తగ్గించుకోవచ్చు. SPF 30 సన్​స్క్రీన్​ని ఉపయోగించండి. నీటిని తరచూ తాగుతూ ఉండండి. మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి అస్సలు వెనకాడకండి. 



Also Read  : క్యాన్సర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. దద్దుర్లు నుంచి అలసట వరకు, అస్సలు ఇగ్నోర్ చేయకండి







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.