తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి ఎనిమిది రాత పరీక్షల ప్రాథమిక కీలను టీఎస్‌పీఎస్సీ గురువారం విడుదలచేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఈ మేరకు అధికారిక ప్రటననను విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా ప్రాథమిక కీలతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా కమిషన్ అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు అక్టోబర్‌ 21 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెలపవచ్చు.


జేఎల్ పోస్టుల భర్తీకి సంబంధించి సెప్టెంబర్‌ 20, 21, 22, 25, 26, 27, 29, అక్టోబర్‌ 3న రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిలో జనరల్‌ స్టడీస్‌/ జనరల్‌ ఎబిలిటీ(పేపర్‌-1), కెమిస్ట్రీ/ తెలుగు/ ఫిజిక్స్‌/ జువాలజీ/ కామర్స్‌/ సివిక్స్‌/ అరబిక్/ ఫ్రెంచ్‌/ హిందీ/ హిస్టరీ/ సంస్కృతం/ ఉర్దూ (పేపర్‌-2) పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్‌ షీట్‌లను విడుదల చేసింది. 


తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3 వరకు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్షలు జరుగుతున్నాయి. మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులను భర్తీ కానున్నాయి.


Webnote


ఆన్సర్ కీల కోసం క్లిక్ చేయండి..


అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి..


అభ్యంతరాలు తెలిపేందుకు క్లిక్ చేయండి..


ALSO READ:


ఎగ్జిమ్ బ్యాంకులో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు - నెలకు రూ.63,840 వరకు జీతం


ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు అక్టోబరు 21 నుంచి నవంబరు 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం


విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నాసిక్‌- కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో 117 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
మహారాష్ట్ర నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్ సూపర్‌వైజర్, ఆర్టిస్ట్, సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 117 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..