భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 240 ఖాళీలను భర్తీచేయనుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూన్ 11తో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఖాళీలను భర్తీచేస్తారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

  


వివరాలు...


* స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు


మొత్తం ఖాళీలు: 240


విభాగాలవారీగా ఖాళీలు..


➥ ఆఫీసర్‌-క్రెడిట్: 200


➥ ఆఫీసర్‌-ఇండస్ట్రీ: 08


➥ ఆఫీసర్‌-సివిల్ ఇంజినీర్: 05


➥ ఆఫీసర్‌-ఎలక్ట్రికల్ ఇంజినీర్: 04


➥ ఆఫీసర్‌-ఆర్కిటెక్ట్: 01


➥ ఆఫీసర్-ఎకనామిక్స్: 06


➥ మేనేజర్-ఎకనామిక్స్: 04


➥ మేనేజర్-డేటా సైంటిస్ట్: 03


➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్: 02


➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ: 04


➥ సీనియర్ మేనేజర్- సైబర్ సెక్యూరిటీ: 03


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి డిగ్రీ/బీఈ/బీటెక్‌/బీఆర్క్‌/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: కనీసం 21-38 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో రీజనింగ్‌, ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 120 నిమిషాలు సమయం ఉంటుంది.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.05.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.06.2023.


➥ ఆన్‌లైన్ రాతపరీక్ష తేది: 02.07.2023


Notification


Online Application



Also Read:


DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


రైట్స్‌ లిమిటెడ్‌లో 20 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు
గురుగావ్‌‌లోని రైట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్‌ డిగ్రీ(సివిల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు గేట్‌ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..