Vaaradhi Mobile App launched: కరీంనగర్ లో ఏర్పాటైన ఐటీ టవర్ నుంచి తొలిసారిగా ఒక పీపుల్ ఫ్రెండ్లీ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ ను అందుబాటులో కి తెచ్చింది ఓ టీమ్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో కాంపిటేటివ్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న" టీమ్ అప్" అనే సాఫ్ట్ వేర్ కంపెనీ నిపుణులు ఓ సరికొత్త యాప్ వారధి (Vaaradhi Mobile App) ను రూపొందించారు. ఈ యాప్ ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు.
జాబ్ చేస్తూనే ప్రిపరేషన్..
ఒకవైపు ఇప్పటికే చేస్తున్న ఇతర ఉద్యోగాలు ప్రశాంతంగా చేసుకుంటూనే, లేదా చదువుకోవడం కొనసాగిస్తూనే జాబ్ కి ప్రిపేరవుతున్న వారికి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున ఓ సరికొత్త యాప్ ను స్థానిక ఐటీ టవర్ నిపుణల సహాయంతో అందుబాటులోకి తెచ్చారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా పనిచేస్తున్న వారధి అనే సంస్థ ద్వారా ఇప్పటికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పిస్తుండటంతో పాటు.. వివిధ రకాల వృత్తి శిక్షణలు అందిస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్స్ ఎగ్జామ్స్ తోపాటు, వివిధరకాల కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటిరీయల్ ను యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ యాప్ ను కరీంనగర్ ఐటీ టవర్ (Karimnagar IT Tower) కేంద్రంగా పనిచేస్తున్న టీమ్ అప్ అనే సాఫ్ట్ వేర్ సంస్థ నిపుణులు తయారు చేసారు. వారధి అనే పేరుతో గూగూల్ ప్లే స్టోర్ లో సెర్చ్ చేసి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ విశేషాలను కలెక్టర్ ఇవాళ వివరించడంతో పాటు.. దాన్నిలాంఛ్ చేసారు. స్థానికంగా ఉన్న సాఫ్ట్ వేర్ నిపుణులు రూపొందించి ఈ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారంతా వినియోగించుకోవచ్చని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో పాటు యాప్ తయారీదారులు తెలిపారు.
తెలంగాణలో 80 వేల ఉద్యోగాలు..
రాష్ట్రంలో 90 వేల ఉద్యోగాలు ప్రకటించగా, 10 వేల ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ మార్చి నెలలో ప్రకటించారు. ఇందులో భాగంగానే పోలీస్ బోర్డ్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర డిపార్ట్ మెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టీఎస్పీఎస్సీ సైతం గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.