మచిలీపట్నంలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ విధానంలో పట్టణలోని జీఎంసీ, జీజీహెచ్‌, ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 164 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు.. 


* పారామెడికల్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 164.


➥ ల్యాబ్ టెక్నీషియన్: 02


➥ ఫార్మసిస్ట్: 01


➥ కంప్యూటర్ ప్రోగ్రామర్: 01


➥ ఆఫీస్ సబార్డినేట్స్: 09


➥ జనరల్ డ్యూటీ అటెండెంట్స్: 02


➥ మార్చురీ అటెండెంట్: 03


➥ స్టోర్ కీపర్: 03


➥ ఎలక్ట్రికల్ హెల్పర్: 01


➥ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్(పీఈటీ): 01


➥ పర్సనల్ అసిస్టెంట్: 01


➥ జూనియర్ అసిస్టెంట్: 03


➥ జూనియర్ స్టెనో/డేటా ఎంట్రీ ఆపరేటర్: 03


➥ డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్: 02


➥ అసిస్టెంట్ లైబ్రేరియన్: 01


➥ హౌజ్ కీపర్స్/వార్డెన్స్: 02


➥ ఫిల్మ్ ఆపరేటర్: 01


➥ అటెండర్స్: 04


➥ క్లాస్ రూమ్ అటెండెంట్స్: 02 


➥ డ్రైవర్స్ (హెవీ వెహికిల్): 02


➥ డ్రైవర్స్ (లైట్ వెహికిల్): 02


➥ వాచ్‌మ్యాన్: 04


➥ క్లీనర్స్/ వ్యాన్ అటెండెంట్: 02


➥ ఆయాలు: 02


➥ స్వీపర్లు: 03


➥ ల్యాబ్ అటెండెంట్స్: 03 


➥ లైబ్రరీ అటెండెంట్స్: 03 


➥ కుక్స్: 06


➥ కిచెన్ బాయ్/టేబుల్ బాయ్: 03


➥ ధోబీ: 01


➥ థోటీ/స్వీపర్స్: 03


➥ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 11


➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 11


➥ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 32


➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01


➥ సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 02


➥ ఛైల్డ్ సైకాలజిస్ట్: 01


➥ స్పీచ్ థెరపిస్ట్: 01


➥ కార్డియాలజీ టెక్నీషియన్: 03


➥ స్టోర్ అటెండర్: 04


➥ అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి  పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఫార్మసీ, బీఫార్మసీ,


➥ బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 04.11.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
Office of the Principal Govt.Medical College, 
o/o GGH Machilipatnam Krishna district.


ముఖ్యమైన తేదీలు...


➥ నోటిఫికేషన్ వెల్లడి: 04.11.2023.


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2023


➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 11.11.2023.


➥ ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడి: 20.11.2023


➥ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 22.11.202


➥ తుది ఎంపిక జాబితాను వెల్లడి: 25.11.2023.


➥ కౌన్సెలింగ్, పోస్టింగ్ తేదీ: 27.11.2023.


Notification & Application


Website


ALSO READ:


అల్లూరి సీతారామరాజు జిల్లాలో 53 ఆశా వ‌ర్కర్ పోస్టులు
పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో 53 ఆశా వర్కర్ పోస్టులను భర్తీచేయనున్నారు. కనీసం 8వ తరగతి లేదా పదోతరగతి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు పరిధిలో... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...