సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.



వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 110


1) ఐటీ: 33 పోస్టులు


2) ఎకనామిస్ట్: 03 పోస్టులు


3) డేటా సైంటిస్ట్: 01 పోస్టు


4) రిస్క్ మేనేజర్: 21 పోస్టులు


5) ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్: 01 పోస్టు


6) ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 01 పోస్టు


7) టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్): 15 పోస్టులు


8) క్రెడిట్ ఆఫీసర్: 08 పోస్టులు


9) డేటా ఇంజినీర్: 09 పోస్ట్లు


10) లా ఆఫీసర్: 05 పోస్టులు


11) సెక్యూరిటీ: 05 పోస్టులు


12) ఫైనాన్షియల్ అనలిస్ట్: 08 పోస్టులు



అర్హత:
సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.



ఎంపిక విధానం:
రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.



దరఖాస్తు రుసుము:
రూ.850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).



ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.09.2022.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 17.10.2022.


ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2022, నవంబరులో.


ఇంటర్వ్యూ తేదీ: 2022, డిసెంబరులో.


Notification


Online Application

Website



ఇవీ చదవండి..


ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1535 ఖాళీలు, దరఖాస్తుకు అర్హతలివే!
భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఖాళీగా ఉన్న.. 1535 ట్రేడ్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ స్టాండర్డ్స్‌, ప్యారామీటర్స్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, వెంటనే దరఖాస్తు చేసుకోండి
ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష, లాంగ్వేజ్ ఫ్రొఫీషిన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 15న ప్రారంభంకాగా.. అక్టోబరు 10 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...