తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థికశాఖ జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 9,168 గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోను కూడా మంత్రి జతచేశారు. దీనికి సంబంధించి గ్రూప్‌-4 రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ హామీకి అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆశావహులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.  

ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన మొత్తం 9168 పోస్టుల వివరాలు ఇలా..

గ్రూప్-4 ఉద్యోగాల్లో నాలుగు కేటగిరీ పోస్టులున్నాయి. వీటిలో కేటగిరీ-1లో జూనియర్ అకౌంటెంట్ - 429 పోస్టులు, కేటగిరీ-2లో జూనియర్ అసిస్టెంట్ - 6,859 పోస్టులు, కేటగిరీ-3లో జూనియర్ ఆడిటర్ - 18 పోస్టులు, వార్డు ఆఫీసర్ - 1,862 పోస్టులు ఉన్నాయి. 

1) జూనియర్ అకౌంటెంట్: 429 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు: ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238

2) జూనియర్ అసిస్టెంట్: 6,859 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

వ్యవసాయశాఖ-44 బీసీ సంక్షేమశాఖ-307 పౌరసరఫరాల శాఖ-72 అటవీశాఖ-23
వైద్యారోగ్యశాఖ-338 ఉన్నత విద్యాశాఖ-742 హోంశాఖ-133 నీటిపారుదల శాఖ-51
మైనార్టీ సంక్షేమశాఖ-191 పురపాలక శాఖ-601 పంచాయతీరాజ్-1,245 రెవెన్యూశాఖ-2,077
సెకండరీ విద్యాశాఖ-97 రవాణాశాఖ-20 గిరిజన సంక్షేమ శాఖ-221 మహిళా, శిశు సంక్షేమం-18
ఆర్థికశాఖ-46 కార్మికశాఖ-128 ఎస్సీ అభివృద్ధి శాఖ-474 యువజన సర్వీసులు-13

3) జూనియర్ ఆడిటర్: 18 పోస్టులు

🔰 విభాగం: డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ఆడిట్

4) వార్డ్ ఆఫీసర్: 1862 పోస్టులు

🔰 విభాగం: కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.

Also Read:  నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 'గ్రూప్స్‌'లో మరిన్ని కొలువులు!





ప్రభుత్వం 80039 ఉద్యోగాల భర్తీకి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 52వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులను దశలవారీగా జారీ చేసింది. 18వేల కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలతోపాటు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయింది. మిగతా పోస్టుల భర్తీకి వీలుగా అన్ని సంబంధిత విభాగాలు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల ప్రకటనతో భర్తీ ప్రక్రియకు కొంత ఆటంకం ఎదురైంది. ఉద్యోగ ఖాళీల ప్రతిపాదనల్లో జనాభా ఆధారంగా గిరిజనులకు రిజర్వేషన్ల ఫలాలను ప్రభుత్వం అందించేందుకు 6నుంచి 10శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. 10శాతం రిజర్వేషన్లతో 100 రోస్టర్‌ పాయింట్లలో 10పాయింట్లను రిజర్వ్‌ చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతిపాదనలకు సవరణలు పూర్తయ్యాయి.

ఒక్కో జిల్లాలో 74 విభాగాలలో కసరత్తు పూర్తికి చేరడంతో ఇక వరుసగా నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో 9వేల ఉద్యోగాలకు, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులపై ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. త్వరలో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...