రీసెంట్ గా 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న హీరో నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తి కాకుండానే.. 'దసరా' అనే మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 


ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారు. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో యంగ్ హీరోగా తన సత్తా చాటుతోన్న రోషన్ మాత్యుని నాని సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. 


తన పాత్ర నచ్చడంతో వెంటనే ఈ హీరో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రోషన్. కథ ప్రకారం.. సినిమాలో హీరోతో పాటు ఉండే ఓ ఫ్రెండ్ రోల్ లో రోషన్ కనిపిస్తాడని టాక్. సినిమాలో చాలా సన్నివేశాలు ఈ ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటాయని సమాచారం. నానితో పాటు రోషన్ కూడా రగ్డ్ లుక్ లోనే కనిపిస్తారట. ఈ సినిమా గనుక హిట్ అయితే రోషన్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. 


ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు.  






Also Read: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..