Virupksha Trailer: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ట్రైలర్ రానే వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే హైదరాబాద్‌ లోని ప్రసాద్స్ మల్టీ ప్లెక్స్‌ లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇక ట్రైలర్ విషయానికి వస్తే..  ట్రైలర్ చాలా అద్బుతంగా ఉంది. టీజర్ తోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ట్రైలర్ మరింత అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథలా కనిపిస్తుంది. చాలా వివరాలను చెప్పకుండానే ట్రైలర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా మలిచారు మేకర్స్. ఆద్యంతం ఉత్కంఠగా సాగింది ట్రైలర్. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ గ్రామంలో ఆకస్మికంగా జరిగే మరణాలు వెనక గల కారణాన్ని కనుగొనే అన్వేషణలో ఉన్నట్లు కనిపిస్తోంది. స్థానికుల మరణాలకు కారణాలు ఏంటి? దీని వెనక ఎవరు ఉన్నారు? వాటిని హీరో ఎలా కనుగొన్నారు వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ట్రైలర్ మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఈసారి సాయి ధరమ్ తేజ్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 



ఇక ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ మధ్య సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి మంచి సూపర్ హిట్ లను అందుకున్నారు. వారిలో బుచ్చిబాబు సనా ‘ఉప్పెన’ సినిమాతో మంచి హిట్ అందుకోగా రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పుడు కార్తీక్ దండు వంతు వచ్చింది. అందుకే ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో ఈ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాపై మంచి హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన మూవీలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో సాయి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెను కూడా సినిమాలో చాలా గ్లామర్ గా చూపించారు. అలాగే మూవీలో సునీల్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Also Read : అనుపమలో ఇంత టాలెంట్ ఉందా? షార్ట్ ఫిల్మ్‌కు సినిమాటోగ్రఫీ