టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత నటిగా తన జోరు మరింత పెంచింది. వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూ బిజీ స్టార్ గా మారింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. చాలా నెలల నుంచి ఈ సినిమా అసలు చర్చల్లోనే లేదు. సమంత సినిమాల లైనప్ లో 'శాకుంతలం' పేరుతో ఒక సినిమా ఉందనే విషయం కూడా జనాలు మర్చిపోయారు. 


రీసెంట్ గా చిత్ర నిర్మాత నీలిమ గుణ.. తమ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది తప్ప అంతకుమించి సినిమా గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుణశేఖర్ ను ట్యాగ్ చేస్తూ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 'శాకుంతలం' భారీ గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సినిమా అని.. అందుకోసం చాలా సమయం, శ్రమ, అవసరం పడుతున్నాయని.. అందుకే ఈ ఆలస్యం అని చెబుతున్నారు గుణశేఖర్.


ఆడియన్స్ కి మంచి సినిమా అందించాలనేది తమ తాపత్రయమని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు. ఇక ఈ సినిమాలో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!


Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి