Varun Sandesh Vithika: టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో ఒక హిట్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన ఒక హిట్ తో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ అందుకొని తర్వాత ఒక హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హీరోలు ఉన్నారు. ఇందులో హీరో వరుణ్ సందేశ్ రెండో కేటగిరీలోకి వస్తారు. ‘హ్యాపీ డేస్’ సినిమాతో మంచి హిట్ అందుకొని తర్వాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్. అయితే ఈ సినిమాల తర్వాత ఆయనకు ఇప్పటి దాకా సరైన హిట్ లేదు. మధ్యలో అడపా దడపా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆయన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. దీంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరం అయిపోయారు వరుణ్ సందేశ్. వితికతో వివాహం తర్వాత కాస్త ఎక్కువగా బయట కనిపిస్తున్నారు. తాజాగా ఈ జంట యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ఓ టీవీ కార్యక్రమానికి గెస్ట్ లుగా వచ్చారు. ఇటీవలే ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ సందర్భంగా సినిమా కెరీర్ లో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది ఈ జంట. 


వరుణ్ సందేశ్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. అయితే తర్వాత వరుణ్ కు సరైన హిట్ అందలేదు. టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో వరుణ్ ఒకరు. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రేక్షకుల్లో కూడా వరుణ్ పై సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే ఆయన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ వస్తోంది. వరుణ్ సందేశ్ 2016లో టాలీవుడ్ నటి రితికను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత వరుణ్, రితిక జంట పలు ఈవెంట్లు, టీవీ ప్రోగ్రాంలలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్ గురించి ఓంకార్ వరుణ్ ను ప్రశ్నించారు ఓంకార్. దానికి వరుణ్ సమాధానం చెబుతూ.. తాను చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సినిమాలు సెలెక్ట్ చేయడంలో తాను ఎక్కడో పొరబాటు చేసినట్లు మాట్లాడారు. ఒకానొక సమయంలో ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని అన్నారు వరణ్.


అనంతరం వరుణ్ భార్య వితిక మాట్లాడుతూ.. ఇద్దరం ఒకే ఆలోచనలు కలిగిన వారమని, ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికే చూస్తామని అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డామని చెప్పుకొచ్చింది. ఏదో చేసేయాలని, కార్లు బంగ్లాలు కొనేయాలి ఏదో ఐపోవాలి అనే ఆలోచన తమకు ఉండదని అంది. ఏదైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తామని చెప్పింది. కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఒకానొక సమయంలో చేతిలో ఒక రూ.5 వేలు కూడా లేవని చెప్తూ భావోద్వేగానికి గురైంది వితిక. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వరుణ్ సందేశ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. గతేడాది ‘ఇందువదన’ సినిమాలో నటించారు. ఈ ఏడాది సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు. తాజాగా ‘చిత్రం చూడర’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు వరుణ్.


Read Also: నా దేశంలో వయసు అనేది అవమానం - ‘ఆంటీ’ ట్రోలర్స్‌కు అనసూయ చురకలు