ప్రియ ఇంట్లో ఉండటం చూసి తను ఇక్కడ ఉంది ఏంటని విక్రమ్ అడుగుతాడు. తను ఇప్పుడు హాస్పిటల్ లో నర్స్ కాదు నీకు మరదలు తన హోదా మారిపోయిందని విక్రమ్ తాతయ్య చెప్తాడు. అదేంటి నేను ఊర్లో లేని రెండు రోజుల్లో ఏం జరిగిందని అడుగుతాడు. చడీచప్పుడు లేకుండా ఈ పెళ్లి ఏంటని అంటాడు. ప్రియ విషయంలో తొందరపడ్డాను తను తల్లి కాబోతుంది. విషయం తెలిసి గొడవ కాబోతుంటే తన మెడలో తాళి కట్టానని సంజయ్ చెప్తాడు. తమ్ముడు చేసిన తప్పుని కూడా మంచి మనసుతో క్షమించావని విక్రమ్ తల్లిని మెచ్చుకుంటాడు. బిడ్డ తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ వెనకేసుకుని రాకూడదు కదా అని అంటుంది. మరి అమ్మవారికి అభిషేకం చేస్తుందేంటని అంటే కోడలికి దోషం ఉందని పంతులు చెప్పాడని బసవయ్య చెప్తాడు. భార్యాభర్తల్లో ఎవరికి దోషం ఉన్నా అది ఇద్దరికీ వర్తిస్తుందట పరిహారం కూడా ఇద్దరూ కలిసే చేయాలంట, ప్రియ అభిషేకం చేస్తుంటే సంజయ్ చూస్తూ ఉంటే ఎలా తనతో పాటు అవుట్ హౌస్ లో ఉండాలి పూజ చేయాలని విక్రమ్ చెప్పేస్తాడు.


Also Read: కావ్యకి సారీ చెప్పిన రాజ్- బయటపడిన అపర్ణ దాష్టీకం, కన్ఫ్యూజన్ లో రుద్రాణి


కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే అమ్మవారు చూస్తూ ఎందుకు ఉంటుందని దేవుడు మనసులోనే సంతోషపడతాడు. ఏ కష్టం వచ్చినా తనకి చెప్పమని విక్రమ్ ప్రియకి భరోసా ఇస్తాడు. వీడు ఏంటి ఇలా కాళ్ళకి అడ్డం పడుతున్నాడని రాజ్యలక్ష్మి తిట్టుకుంటుంది. అన్నయ్య చెప్పినట్టు చెయ్యమని తల్లి కూడా వెళ్లిపోవడంతో సంజయ్ ఇరుక్కుపోతాడు. దివ్య తులసితో మాట్లాడుతూ ఉండగా లాస్య వచ్చి బొకే వచ్చిందని చెప్పి తీసుకొస్తుంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు కానీ బొకేలు పంపిస్తున్నాడా అని దివ్య ఆ బొకే తీసుకోబోతుంది. కానీ లాస్య ఆ బొకే తీసుకొచ్చి కావాలని తులసి ఒళ్ళో పెట్టేస్తుంది. బొకేలో పేరు ఏమి లేదని ఫ్రెండ్ అనే ఉందని తులసి అనేసరికి దివ్య ఊపిరి పీల్చుకుంటుంది. అది చూసి లాస్య విక్రమ్ ప్రేమలో నువ్వు కూరుకుపోవాలని మనసులో అనుకుంటుంది. లాస్య బిజినెస్ లో పెట్టిన అమౌంట్ పోయిందని తన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తుంది. నందుకి తెలిస్తే పీక పిసికేస్తాడు, విషయం బయట పెట్టకముందే డబ్బులు ఎలాగైనా తీసుకురావాలని అనుకుంటుంది.


అమ్మ మొహంలో దిగులు కనిపిస్తుంది ఎందుకని విక్రమ్ దేవుడిని అడుగుతాడు. ఈ ఇంట్లో పరిస్థితి బాగోలేదని దేవుడు మనసులో బాధపడతాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు అడ్డం పడినా దివ్యమ్మని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు. అమ్మ ప్రేమ దివ్య ప్రేమని దూరం చేస్తుందేమోనని భయపడతాడు. డైమండ్ రింగ్ చూపించి ఇది ఇచ్చి దివ్య వేలుకి పెట్టి ప్రపోజ్ చేస్తానని అంటాడు. దివ్య ప్రేమ, అమ్మ ప్రేమ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారని దేవుడు చాలా బాధగా అడుగుతాడు. విక్రమ్ మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకు అమ్మని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని విక్రమ్ చెప్తాడు. అమ్మగారికి దివ్య అంటే పీకల దాకా కోపం, మీకు ప్రేమ ఏది గెలుస్తుందోనని టెన్షన్ గా ఉందని బాధపడతాడు. దివ్య విక్రమ్ మెసేజ్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండటం లాస్య గమనిస్తూనే ఉంటుంది.


Also Read: ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దామన్న యష్- విన్నీ కుట్రతో మళ్ళీ మొదటికొచ్చిన వేద జీవితం


ఫోన్ టేబుల్ మీద పెడితే విక్రమ్ మెసేజ్ చేస్తే అమ్మ చూస్తుందని చెప్పి డ్రెస్ లో ఫోన్ దాచేస్తుంది. విక్రమ్ మెసేజ్ చూసి కాల్ చేస్తాడు. ఫోన్ సైలెంట్ లో ఉండేసరికి గుయ్ మని సౌండ్ వస్తుంటే దివ్య నవ్వుతో కవర్ చేస్తుంది. కాసేపటికి పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి నడుము, గోల, అనుమానం అని ఏదేదో మాట్లాడుతుంది. మీరు మెసేజ్ చేస్తే మొబైల్ వైబ్రేషన్ లో పెట్టి నడుము దగ్గర దోపుకున్నానని చెప్తుంది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. రెస్టారెంట్ లో కలుసుకుందామని చెప్తాడు. దివ్య సంతోషంగా గింగిరాలు తిరుగుతుంటే లాస్య చూసేస్తుంది. అప్పుడే రాజ్యలక్ష్మి లాస్యకి ఫోన్ చేస్తుంది. ఇంటికి వచ్చి కలవమని చెప్తుంది. లాభం ఉన్న పనేనని చెప్పేసరికి లాస్య వస్తానని అంటుంది.