Seethe Ramudi Katnam Today Episode: తన భర్తకి తాను గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్రేస్‌లెట్ తానే దొంగతనం చేశాను అని మహాలక్ష్మి నింద వేసిందని.. తన మేనకోడలు అయిన సీత సమయానికి నిజం బయట పెట్టి తన పరువు కాపాడిందని విద్యాదేవి అనుకుంటుంది. మహా ఇంట్లో ఉన్న పది రోజుల్లో మహాని బద్నాం చేసి తన పగ తీర్చుకొనే ఇంటి నుంచి వెళ్తానని విద్యాదేవి అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మికి జనార్థన్, అర్చన, గిరిధర్‌లు వచ్చి భోజనానికి పిలుస్తారు. ఇక మహా వాళ్ల మాటలు విద్యాదేవి చాటుగా వింటుంది. 


మహాలక్ష్మి: ఆ సీత మనకి దెబ్బ మీద దెబ్బ తీస్తుంది. అయినా మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం. రామ్, మధులను ఒకటి చేద్దాం అనుకుంటే ఆ విద్యాదేవి వచ్చి అంతా నాశనం చేసింది. సీతని గెలిపించి మన ఇంట్లో నుంచి మధుని పంపించేసింది. ఏదో ఒకటి చేసి టీచర్‌ని ఇంట్లో నుంచి పంపేద్దామనుకుంటే సీత మన ప్లాన్ తిప్పికొట్టింది. ఇంకో పది రోజులు సీత మన ఇంట్లో ఉన్నట్లు చేసింది. మనకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా మీకు ఎలా ఆకలి వేస్తుంది. 
జనార్థన్: నువ్వేం వర్రీ అవ్వకు మహా మధుని ఎలా అయినా వెనక్కి తీసుకొద్దాం. 
మహాలక్ష్మి: ఆ ప్రయత్నం కూడా అయింది. మధు ఇక ఈ ఇంటికి, రామ్ జీవితంలోకి రాను అని తేల్చేసింది. అక్కడే ఆ మురికి కొంపలోనే ఆ అవిటి వాడైన సూర్యతోనే ఉంటుంది అంట. ఈ అంతఃపురం వద్దంట. మధుకి మన మీద నమ్మకం పోయింది. సీత మీద భయం పుట్టుకొచ్చింది. 
విద్యాదేవి: మధు మంచి నిర్ణయం తీసుకుంది. 


సీతని పంపించడానికి మధు రాకపోతే ఎలా అని అనుకుంటారు. సీతని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అదే అసలైన సమస్య అని మహా అంటుంది. రామ్ సీతకు దగ్గరైపోతున్నాడు అని.. ఇద్దరినీ ఇప్పటి వరకు కలవకుండా చేశామని ఇకపై వాళ్ల తొలిరేయి అయిపోతే కష్టమని అనుకుంటారు. ఆ మాట విద్యాదేవి వింటుంది. సీతా, రామ్‌లకు ఇంకా తొలిరేయి అవ్వలేదా అని బాధపడుతుంది. తానే వాళ్లని కలుపుతాను అని సీతతో మాట్లాడటానికి వెళ్తుంది. ఇక విద్యాదేవి సీత దగ్గరకు వెళ్లి నువ్వు రామ్ ఎలా ఉంటారు అని అడుగుతుంది. అయితే సీతకు తొలిరేయి గురించి అడిగితే ఇబ్బంది పడుతూ సీత బయట తనకి ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటాడు కానీ శారీరకంగా కలవలేదు అని అంటుంది. 


సీత: మామ మొదట చూసింది ఇష్టపడింది మా అక్కని. మహా అత్తయ్య కూడా మా అక్కనే కోడలిగా చేసుకోవాలి అనుకుంది. కానీ అది జరగలేదు. అందుకే అత్తయ్య నన్ను కోడలిగా ఒప్పుకోవడం లేదు. మా ఇద్దరినీ కలపకుండా అత్తయ్య అడ్డుకట్ట వేసింది. ఆయన మా అత్తయ్య మాట జవదాటరు. 
విద్యాదేవి: మీరు ప్రపంచానికే కాదు. పడక గదిలో కూడా ఒక్కటవ్వాలి. మీ వనవాసం కూడా ముగిసి పోవాలి. నువ్వు రామ్ ఒక్కటై మీ దాంపత్యం పరిపూర్ణం కావాలి నేను మాట్లాడుతాను.
సీత: మనసులో.. ఎవరు ఈవిడ నాకు ఈవిడకు ఏంటి సంబంధం. ఇంత చనువుగా మాట్లాడుతుంది. నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది. రక్త సంబంధమా కాదు. నన్ను మామని ఒక్కటి చేయడానికి ఆ దేవుడే టీచర్‌ని పంపించుంటాడు.


విద్యాదేవి రామ్ దగ్గరకు సున్నుండలు తీసుకొని వెళ్తుంది. కొడుకు కోడలు అంటూ విద్యాదేవి రామ్‌తో మాట్లాడుతుంది. సీత రాముల గురించి రామ్‌కి చెప్తూ లవకుశులను మీరు ఎప్పుడు కనబోతున్నారు అని రామ్‌ని అడుగుతుంది. రామ్ సైలెంట్ అయిపోతాడు. సీత ఆ మాటలు విని ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఏం ఆలోచించలేదు అని రామ్ అంటాడు. విద్యాదేవి ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు అని అండిగితే కొన్ని రోజులు ఆగమని పిన్ని చెప్పిందని రామ్ అంటాడు. మీ మధ్య ఆవిడ ఎందుకు అని అంటుంది. కార్యేసుదాసి.. కరణేసు మంత్రి.. శయనేసు రంభ అని రామ్‌ని మోటివేట్ చేసి ఆలోచించమని చెప్తుంది. సీత విద్యాదేవిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మా సుమతి అత్తమ్మలా నా గురించి ఆలోచిస్తున్నారు అంటే విద్యాదేవి తనని రామ్ తల్లి అనుకో నీ మేనత్త అనుకో అని చెప్తుంది. దాంతో సీత అత్తమ్మ అని కాళ్ల మీద పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: కాళీని రోడ్లమీద పరుగెత్తించి క్షమాపణ చెప్పించిన క్రిష్.. మైత్రి రావడంతో నందినిలో మొదలైన ఈర్ష్య!