Satyabhama Today Episode : సత్య బయట అటూ ఇటూ తిరుగుతూ భైరవి చెప్పిన చుట్టాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వ్రతం మొదలై ఉంటుందని బాధ పడుతుంది. ఇంతలో రేణుకు అక్కడికి వస్తే అత్తయ్య తరఫు చుట్టాలు ఇంకా రావడం లేదు అని చెప్తుంది. దానికి పుట్టింటికి వెళ్తాను అన్నావనే అలా అబద్ధం చెప్పారని చెప్తుంది. తన అత్తమ్మ చెప్పిన చుట్టాలు ఎప్పుడూ రారు అని అదంతా అబద్ధం అని అంటుంది. సత్య ఇప్పుడే అడుగుతాను అంటే తాను దొరికిపోతాను అని వద్దని చెప్తుంది. క్రిష్ గాయలతో కాళీ వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు.


క్రిష్: రేయ్ నేను జీవితంలో రెండు తప్పులు చేశా. ఒకటి నిన్ను నమ్మి దగ్గరకు తీసుకోవడం. రెండు చేతికి దొరికిన నిన్ను చంపకుండా విడిపెట్టడం. ఇక నీతో నేను మూడో తప్పు చేయనురా. చంపకుండా విడిచిపెట్టనురా. అంటూ క్రిష్ రౌడీలను చితక్కొడతాడు. కాళీ గుండె మీద కాలు వేసి నన్ను చంపాలి అని చూస్తావా వరంగల్ కింగ్‌రా ఇక్కడ. రేయ్ నీకు సంధ్య కావాలారా. అసలు ఏంట్రా నీ ప్రాబ్లమ్‌ ఇన్నాళ్లు సత్యని సతాయించావ్ తన్ని తరిమేశా. ఇప్పుడు నా మరదల్ని సతాయిస్తున్నావా. 
సత్య: నువ్వు చెప్పింది నిజమే అక్క ఈ ఇంట్లో మగాలకి మనసు ఉండదు అక్క. క్రిష్ కూడా అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్నా అంటాడు. కానీ ఎప్పుడూ నా మనసుని అర్థం చేసుకున్నది లేదు తన దోరిని తనదే.
క్రిష్: రేయ్ నువ్వు సంధ్యని కెలికినా నాకు ఫరక్ పడదు. కానీ సంధ్య బాధ పడితే సత్య బాధ పడుతుంది. సత్య బాధ పడితే నా దిమాక్‌లో ఫిల్మెంట్ బర్న్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేస్తానో నాకు తెలీదు. సత్య అంటే నాకు ప్రాణం కాదురా. ప్రాణం కంటే ఎక్కువ. తను నన్ను ఛీ కొట్టినా దూరం అయినా దూరం చేసిన సత్యతోనే నా మనసు ఎప్పుడూ ఉంటుంది. నీడలా ఉంటుంది. 


సత్య గురించి క్రిష్‌ ప్రేమగా గొప్పగా కాళీతో చెప్తే సత్య మాత్రం రేణుకతో క్రిష్‌ గురించి తప్పుగా చెప్తుంది. ఇక కాళీ ఎంత వదిలేయ్‌మని వేడుకున్నా క్రిష్ కనికరించడు. కాళీని పట్టుకొని నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదు పదరా అంటూ తీసుకెళ్తాడు. మరోవైపు వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. మైత్రి హర్షని ప్రేమగా చూస్తుంది. హర్ష దగ్గరకు వెళ్లి నిల్చొంటుంది. దాన్ని నందిని చూస్తుంది. ఇక విశాలాక్షి సత్యకి కాల్ చేస్తుంది. పూజ మొదలవుతుందని చెప్తుంది. సత్య తను రావడం లేదు అని చెప్తుంది. విశాలాక్షి షాక్ అవుతుంది. తన అత్తయ్యకు తలనొప్పి వచ్చిందని నేను ఇంట్లోనే ఉండాలి అని మీరు కానివ్వండి అని చెప్తుంది. ఇక నందినికి మైత్రి, హర్షలు ఒకర్ని ఒకరు చూసుకోవడం ఇష్టం లేక హర్ష దగ్గరకు వచ్చి పూజ మొదలైంది రా కూర్చొందామని పిలుస్తుంది. బలవంతంగా తీసుకెళ్లిపోతుంది. హర్ష మైత్రిని చూస్తుంటే తట్టుకోలేకపోతుంది.


మరోవైపు క్రిష్‌ కాళీ చేతులు కట్టేసి బండికి కట్టి రోడ్డు వెంట పరుగులు పెట్టిస్తాడు. కాళీ వద్దు అని ఎంత బతిమాలినా కనికరించడు. మరోవైపు నందిని, హర్షలు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. నందిని హర్ష కాళ్లకి కూడా దండం పెడుతుంది. పూజలో ఇద్దరూ కూర్చొంటారు. ఇక క్రిష్ కాళీని తీసుకొని విశ్వనాథం ఇంటికి వస్తాడు. సంధ్య బయపడుతుంటే కాళీ చచ్చిన పాము అని భయపడొద్దు అని అంటాడు. వీడు తన ఫ్యామిలీ జోలికి వస్తే అలా ఎలా వదులు తాను అని విశ్వనాథం, సంధ్య కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తేనే వదులుతాను అంటాడు. 


అక్కడే మరోసారి కాళీకి వార్నింగ్ ఇస్తాడు. వాళ్లు క్షమాపణ చెప్తేనే నిన్ను బతకనిస్తాను అని లేదంటే చంపేస్తానని అంటారు. కాళీ విశ్వనాథం, సంధ్యలను క్షమించమని వేడుకుంటాడు. విశ్వనాథం క్షమించాను అని అంటాడు. దాంతో కాళీ వెళ్లిపోబోతే క్రిష్ ఆపి ఇక్కడితే ఇది ఆగకపోతే ఈ చావు వార్త వైరల్ అవుతుందని బెదిరిస్తాడు. కాళీ అలాగే అంటూనే మిమల్ని వదలను అన్నట్లు విశ్వనాథం, సంధ్యలను చూస్తాడు. వీడియోలతో మీ జీవితాలతో ఆడుకుంటానని అంటాడు. మీ బాధ్యత కూడా నాదే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: స్కూల్ నుంచి వెళ్లిపోతున్నా అంటూ ఎమోషనల్ అయిన లక్కీ.. మిత్రకు కారు ప్రమాదం జరుగుతుందా!