Nindu Noorella Savasam Today Episode పిల్లలు తమతో పాటు తినమని మిస్సమ్మ తండ్రిని పిలుస్తారు. మందు ఆయనే విషం కలిపిన అన్నం తినేస్తారు. మిస్సమ్మ పరుగున స్కూల్ దగ్గరకు వస్తుంది. పిల్లలు కూడా మిస్సమ్మని పొగుడుతారు. మిస్సమ్మ తండ్రి ఫుడ్ మొత్తం తినేస్తాడు. చేతులు కడుక్కోవడానికి వెళ్లిని మిస్సమ్మ తండ్రి విష ప్రభావంతో విలవిల్లాడిపోతాడు. మరోవైపు ఆరు ఆత్మ తనకు ఏదో కీడు శంకిస్తుందని దేవుడిని దండం పెట్టుకుంటుంది. మిస్సమ్మ తండ్రి పడిపోతాడు. ఇక మిస్సమ్మ పరుగున వచ్చి పిల్లలు తినగానే పిలిచి ఆపి వాళ్ల తినే అన్నం తోసేస్తుంది. పిల్లలు ఏమైందని అడిగితే ఫుడ్ పాడైపోయిందని మళ్లీ తెస్తానని అంటుంది. ఇంతలో పిల్లలు తాతయ్య తినేశారని చెప్తారు. మిస్సమ్మ షాక్ అయిపోతుంది. 


మిస్సమ్మ నాన్న తిన్నారా.. అని అడిగి పరుగులు తీస్తుంది. తండ్రి పడిపోవడం చూసి ఏడుస్తుంది. పిల్లలు కూడా తాతయ్య తాతయ్య అని ఏడుస్తారు. మరోవైపు అమర్‌ మనోహరిని తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తుంటాడు. పోలీస్‌స్టేషన్‌కి వెళ్తే తన పని అయిపోతుందని భయపడుతుంది మనోహరి. అందరూ పోలీస్‌ స్టేషన్‌కి వస్తారు. మనోహరి అమర్‌తో తనని చూడటానికి భయంగా ఉందని అంటుంది. అమర్ మనోహరితో ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. అమర్ మనోహరిని తీసుకొని రణవీర్ దగ్గరకు వెళ్తాడు. మనోహరి ప్రవర్తనకు రాథోడ్‌కి అనుమానం వస్తుంది. కరెక్ట్‌గా రణవీర్‌ని కలిసే టైంకి అమర్‌కి కాల్ రావడంతో వెనక్కి వెళ్లిపోతారు. మిస్సమ్మ ఫాదర్‌కి ఫుడ్ పాయిజిన్ అయిందని హాస్పిటల్‌కి వెళ్లాలని చెప్తాడు. ఇక మనోహరి పిల్లలకు ఏం కాలేదా అని అప్‌సెట్ అవుతుంది. ఇక మిస్సమ్మ తన తండ్రిని తీసుకొని హాస్పిటల్‌కి వస్తాడు. పిల్లలు, మిస్సమ్మ ఏడుస్తుంటారు. డాక్టర్లు వైద్యం మొదలు పెడతారు. పిల్లల్ని పట్టుకొని మిస్సమ్మ ఏడుస్తుంది. తండ్రి పరిస్థితిని డాక్టర్లను అడుగుతుంది. ఇప్పటికి అయితే ప్రాబ్లమ్ లేదు కానీ గతంలో ఏదో సమస్య ఉందని అంటే మిస్సమ్మ లంగ్స్ ఆపరేషన్ అయిందని చెప్తుంది. దీంతో డాక్టర్ పాత ఫైల్స్ తీసుకొని రమ్మంటారు. 


మిస్సమ్మ తన పిన్నికి కాల్ చేస్తుంది. హాస్పిటల్‌లో ఉన్నానని తండ్రికి ఏం జరిగిందో చెప్తుంది. తన తండ్రి పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని రమ్మని చెప్తుంది. అమర్ మిస్సమ్మ పిల్లల్ని కాపాడిందని మిస్సమ్మ పక్కన ఉండగా తన పిల్లలకు ఏం కాదు అని కానీ మిస్సమ్మ గురించి తన తండ్రి గురించి టెన్షన్ పడుతున్నా అని అమర్ చెప్తాడు. అమర్ మిస్సమ్మని పొగడటంతో మనోహరి రగిలిపోతుంది. ఇక అమర్ తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్లని వదిలి పెట్టనని అంటాడు. మిస్సమ్మ ఏడుస్తుంటుంది. దేవుడిని దండం పెట్టుకుంటుంది. అది చూసి పిల్లలు ఎమోషనల్ అయిపోతారు. అమ్ము కూడా వచ్చి తాతయ్యకు ఏం కాకుండా చూడని దేవున్ని దండం పెట్టుకుంటుంది. దీంతో మిగతా పిల్లలు అందరూ వచ్చి దేవుడిని దండం పెట్టుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!