Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరిని నగల విషయంలో అందరి ముందు బుక్‌ చేస్తుంది మిస్సమ్మ. నేనేదో అనుకున్నాను కానీ నువ్వు ఈ మాత్రం దానికే భయపడుతున్నావా? అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. పిల్లలను క్యాంపుకు కాదు కదా గేటు కూడా దాటనివ్వను అంటూ చాలెంజ్‌ చేస్తుంది. దీంతో మనోహరి కోపంగా చూస్తుండిపోతుంది. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. మనోహరి ఘోర దగ్గరకు వస్తుంది. మనోహరిని చూసి ఘోర నవ్వుతుంటాడు.


మనోహరి: నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు.


ఘోర: ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు కూడా ఇలాగే పిచ్చి దానిలా నవ్వుతావు.


మనోహరి: నువ్వు ఎమంటున్నావో నాకు అర్థం కావడం లేదు.


ఘోర: మూడు రోజుల్లో జరగనున్న నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను.


మనోహరి: నా పెళ్లి జరుగుతుందని నీకెలా తెలిసింది. నేను నీకు చెప్పలేదు కదా?


అనగానే ఘోర నాకు కనిపించిందని పౌర్ణమి రోజు నీ పెళ్లి జరుగుతుందని చెప్తుంది. దీంతో పౌర్ణమి అయితే నాకొచ్చిన నష్టం ఏంటి అని మనోహరి అడుగుతుంది. దీంతో నీకు రాబోతున్న గండం పేరు అరుంధతి. పౌర్ణమి నాడు ఆ ఆత్మకు రాబోతున్న శక్తి వల్ల నీకు నీ ప్రేమకు ముప్పు ఉందని చెప్తాడు. ఆ ఆత్మకు ఎన్ని శక్తుల వచ్చినా ఈ పెళ్లి ఆగదు. అనగానే అలా అనుకోవడంతోనే నీ పతనం మొదలవుతుంది అని ఘోర చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది.


మనోహరి: నేను అంత పక్కాగా ప్లాన్‌ వేసి చేస్తే పెళ్లి వేరెవరితో జరుగుతుందంటున్నారు ఎవరితో జరుగుతుంది.


మంగళ: బాగీతో ( అంటూ మంగళ వస్తుంది.)


మనోహరి: ఏమంటున్నావు మంగళ


మంగళ: అవును పౌర్ణమి నాడు ఆ తాళి పడేది బాగమతి మెడలో పెళ్లి జరిగేది బాగమతికి అమరేంద్ర బాబుకు.


  అనగానే మనోహరి, మంగళను ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తానని అంటుంది. దీంతో మంగళ పంతులు చెప్పిన విషయం చెబుతుంది. మీరు మీ శక్తినంతటిని కూడదీసుకుని ఈ పెళ్లిని ఆపాలి. మీ పెళ్లితో నా భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది మేడం అందుకే నా తమ్ముణ్ని జైలు పాలు చేసిన మీతో కలిపిపోయాను అని చెప్తుంది. మరోవైపు మిస్సమ్మకు కరుణ ఫోన్‌ చేసి రేపు కలుద్దామని చెప్తుంది. లేదని రేపు పిల్లలకు ఇంపార్టెంట్‌ వర్క్‌ ఉందని రానని చెప్తుంది. ఇదంతా విన్న  అమర్‌ మరుసటి రోజు ఉదయాన్నే లేచి పిల్లలకు అన్నీ రెడీ చేస్తాడు. అది చూసిన మిస్సమ్మ షాక్‌ అవుతుంది. దేవుడు నా మాట విన్నాడేమో అనుకుంటుంది. ఇంతలో అమర్‌ వచ్చి నేనే చేశానని నువ్వు పిల్లలను రెడీ చేసి నువ్వు బయటకు వెళ్లవచ్చు అంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన మనోహరి ప్రిన్సిపాల్‌ కోసం ఎదురుచూస్తుంటుంది. ప్రిన్సిపాల్‌ వస్తుంది.


మనోహరి: మీరేం చేస్తారో నాకు తెలియదు. పిల్లన్ని కిందకు పిలిచాకా  పది నిమిషాల్లో వాళ్లు నీ  కారులో ఉండాలి. అమర్‌ మనసు మారేలోపు మీరు ఈ ఏరియాలో కూడా ఉండకూడదు.


ప్రిన్సిపాల్‌: మీరు ఏం టెన్షన్‌ పడకండి. పక్కాగా ప్లాన్‌ చేశాను. మీరు పెళ్లి సంగతి చూసుకోండి.


మనోహరి: సరే అమర్‌ వాళ్లను పిలుస్తాను మీరు కూర్చోండి. అమర్‌, అత్తయ్యా , మామయ్యా, పిల్లలూ త్వరగా కిందకు రండి మిమ్మల్ని తీసుకెళ్లడానికి ప్రిన్సిపాల్‌ గారు వచ్చారు.


అనగానే అందరూ కిందకు వస్తారు. పిల్లలు ఏడుస్తూ..  వెళ్లే ముందు ఒకసారి అమ్మ ఫోటోకు దండం పెట్టుకుని వెళ్తామని చెప్పి రూంలోకి వెళ్తారు. మిస్సమ్మ కూడా మేడం ఫోటో ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడైనా చూద్దామని లోపలికి వెళ్లబోతుంటే మనోహరి ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, న‌టుడు డేనియ‌ల్ బాలాజీ హ‌ఠాన్మ‌ర‌ణం