Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో ఉన్న మిస్సమ్మ రాథోడ్‌ను ఇంటికి  వెళ్లమని మనోహరికి ఫైనల్‌ టచ్‌ ఇచ్చి వస్తానని చెప్పడంతో రాథోడ్‌ ఇంటికి వెళ్తాడు. మిస్సమ్మ మనోహరి దగ్గరకు వెళ్తుంటే .. అప్పటికే మంగళ ఫోన్‌ చేసి మిస్సమ్మ నీ దగ్గర నాటకం ఆడుతుందని చెప్పడంతో మనోహరి కోపంగా ఉంటుంది. దీంతో మిస్సమ్మను  మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వస్తుంది.


మిస్సమ్మ: పూజంతా అయిపోయిందట మీరు ఇక తినేయొచ్చు. దానికంటే ముందు 101 కొబ్బరి కాయలు మీరే కొనుకొచ్చి గుడిలోపలికి మోసుకొచ్చి కొట్టాలట. ఏమైందక్కా అలా చూస్తున్నావు పద త్వరగా తీసుకొచ్చి కొట్టేస్తే నువ్వు తినేయొచ్చు. ఎందుకక్కా అలా చూస్తున్నావు ఏమైంది?


మనోహరి: ఏం లేదు నా ముందు నిల్చొని ధైర్యంగా మాట్లాడటానికి అందరూ బయపడతారు. అలాంటిది నువ్వు నన్ను ఎలా మోసం చేశావా అని ఆలోచిస్తున్నాను.


మిస్సమ్మ: నేను మోసం చేయడం ఎంటక్కా..?


మనోహరి: అంత ప్లాన్‌ చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన నాతోనే మళ్లీ ఇంట్లోకి రమ్మని అడిగేలా చేసుకున్నావు. నచ్చేశావు మిస్సమ్మ.


అంటూ మనోహరి కోపంగా మిస్సమ్మను తిడుతుంది.  అయితే మొత్తం మీకు తెలిసిపోయిందా అంటూ మిస్సమ్మ అనగానే మర్యాదగా చెప్తున్నాను ఎలా వచ్చావో అలాగే వెళ్లిపో లేదంటే బాగుండదు అని మనోహరి వార్నింగ్‌ ఇవ్వగానే.. నువ్వు కూడా మర్యాదగా వెళ్లి ఆయనతో నిజం చెప్పి వెళ్లిపో నేను క్షమిస్తాను అంటుంది మిస్సమ్మ. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. దీంతో మిస్సమ్మ ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని నీ నుంచి నేను కాపాడతాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు అరుంధతి కంగారుపడుతుంది. మిస్సమ్మ ఇంటికొస్తే నా ఫోటో చూస్తుంది అని గుప్తను ఏదైనా చేయండి అని అడుగుతుంది.


గుప్త: నేను ఏమీ చేయలేను.. చేయలేను


అరుంధతి: అసలు మిస్సమ్మకు నిజం తెలిస్తే నాకొచ్చే నష్టం ఏంటి? మిస్సమ్మకు నిజం తెలిస్తే వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పేస్తుంది. అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది.


అనగానే గుప్త కంగారుపడుతుంటాడు. ఇంతలో రాథోడ్‌ వచ్చి గుప్తను తిడతాడు. నువ్వు నాకింద పనిచేస్తున్నావా? నేను నీకింద పనిచేస్తున్నానా అంటూ నిలదీయడంతో గుప్త నాకో సందేహం ఉందని శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఆమె ఫోటో పెట్టడం అవసరమా అని అడగ్గానే దేవత ఫోటో ఎక్కడ పెట్టినా మంచిదే అంటాడు రాథోడ్‌. దీంతో అరుంధతి సెంటిమెంట్‌ తో కొట్టావు రాథోడ్‌ అనుకుంటుంది. ఇంతలో మనోహరి వచ్చి తోటమాలివి ఈ గెటప్‌లో ఉన్నావేంటి అని అడిగి లోపలికి వెళ్తుంది. లోపల హాల్ లో అరుంధతి ఫోటో చూసి మనోహరి షాక్‌ అవుతుంది.


మనోహరి: నువ్వు చచ్చాక కూడా నువ్వు నన్ను మనఃశాంతిగా ఉండనీయటం లేదే? నీ చెల్లేమో నీకోసం నన్ను ఓడిస్తానని శపథం చేసిందే.. నీలా ఈఫోటో ఇక్కడ పెట్టింది ఎవరే..


అమర్‌: నేనే ఎందుకు అరు ఫోటో అక్కడ ఉండకూడదా?


మనోహరి: అలా ఏం లేదు అమర్‌ ఎవరు పెట్టారో కనుక్కుని చాలా మంచి పని చేశారని చెబుదామనుకున్నా


అని మనోహరి అనడంతో అమర్‌ ఎమోషనల్‌గా ఫీల్‌ అవుతాడు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా చూస్తుంటుంది. అమర్‌ వెళ్లిపోతాడు. ఇప్పుడు మిస్సమ్మ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం తెలిసిపోతుందని మనోహరి భయపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి గుప్త, అరుంధతి షాక్‌ అవుతారు. అరుంధతి దగ్గరకు వచ్చిన మిస్సమ్మ మనోహరికి నిజం తెలిసిందని చెప్తుంది. ఇంతలో గుప్త లోపలికి వెళ్లి నీ ఫోటో తీసేయిస్తానని వెళ్లిపోతాడు. మరోవైపు లోపల పంతులు ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. మనోహరి మాత్రం హ్యాపీగా పీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: 50 సెకన్ల యాడ్‌కే నయన్‌కు ఇంత భారీ పారితోషకమా? - స్టార్‌ హీరోలు కూడా ఈ రేంజ్‌లో తీసుకోలేదేమో!