Mogali Rekulu Fame Pavitranath Death: కొన్ని సీరియల్స్ ముగిసిపోయి ఎంతోకాలం అయినా కూడా బుల్లితెర ప్రేక్షకుల మనసుల్లో మాత్రం నిలిచిపోతాయి. అలాంటి వాటిలో ‘చక్రవాకం’, ‘మొగలిరేకులు’ మొదటి స్థానంలో ఉంటాయి. ముఖ్యంగా ‘మొగలిరేకులు’ అయితే ఎంతోమంది బుల్లితెర నటీనటులను స్టార్లను చేసింది. ఈ సీరియల్ ముగిసిపోయి ఎంతోకాలం అయినా కూడా ఇప్పటికీ ఇందులోని పాత్రలు చాలామందికి గుర్తున్నాయంటే ఇది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కానీ తాజాగా ఇందులో దయ పాత్రలో నటించిన పవిత్రనాథ్ మరణించాడంటూ వస్తున్న వార్తలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. పవిత్రనాథ్ మరణించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఓ సీరియల్ నటి.


ఇంద్రనీల్ పోస్ట్..


‘మొగలిరేకులు’లో ధర్మ, సత్య, దయగా నటించిన వారిని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇందులో దయ పాత్రలో నటించిన ఇంద్రనీల్ ప్రస్తుతం ఎక్కువగా బుల్లితెరపై కనిపించడం లేదు. ఇంద్రనీల్, తన భార్య మేఘన కలిసి పవిత్రనాథ్ మరణవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఎప్పటికీ జరగదు అనుకున్నది జరగడంలో ఎక్కువ బాధ ఉంటుందా లేదా జరిపోయినదాని గురించి షాక్ అవ్వడంలో ఎక్కువ బాధ ఉంటుందా అర్థం కావడం లేదు పవి. నువ్వు మా జీవితాల్లో చాలా ముఖ్యమైన భాగం అయిపోయావు. అందుకే ఈ వార్త విన్నప్పుడు ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఫేక్ అవ్వాలి అనుకున్నాం’ అంటూ ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.


అసలు ఏం జరిగింది?


‘నువ్వు నిజంగానే లేవు అనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం బ్రదర్. కనీసం నీకు గుడ్ బై చెప్పే ఛాన్స్ దొరికినా బాగుండేది అనిపిస్తోంది. కచ్చితంగా నిన్ను చాలా మిస్ అవుతాం పవి. నీకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. నువ్వు లేవన్న బాధ నుండి నీ కుటుంబం ఎప్పటికీ బయటికి రాదని తెలుసు అయినా వారు ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం’ అంటూ మేఘన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పవిత్రనాథ్ మరణించిన విషయం బయటికొచ్చింది. ఇది చూసిన వారంతా అసలు ఎలా జరిగింది, ఎందుకు చనిపోయాడు. ఉన్నట్టుండి ఏంటిది అని ఎన్నో ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ వీరు మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.






కృంగిపోయాడు..


పవిత్రనాథ్ మరణ వార్త ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. తను ఏదైనా వ్యాధి వల్ల మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? ఇలా ఎన్నో సందేహాలు ప్రేక్షకుల మైండ్‌లో నిండిపోయాయి. కానీ టీవీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. గత కొన్నిరోజులుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ ఏం బాలేదని తెలుస్తోంది. తను చాలా కృంగిపోయాడని సన్నిహితులు చెప్తున్నారు. రెండేళ్ల క్రితం పవిత్రనాథ్ భార్య శశిరేఖ.. తనపై సంచలన ఆరోపణలతో మీడియా ముందుకు వచ్చింది. పవిత్రనాథ్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని, గత 8 ఏళ్లుగా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతే కాకుండా ప్రశ్నించినందుకు తనను కొట్టేవాడని కూడా చెప్పింది. అది జరిగిన రెండేళ్ల తర్వాత ఉన్నట్టుండి పవిత్రనాథ్ మరణ వార్త అందరిలో సందేహాలను మరింత పెంచేస్తోంది.


Also Read: కరణ్ జోహార్‌ ను ఉద్దేశిస్తూ నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన 'లోఫర్' బ్యూటీ!