Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode పెద్దాయన టీవీ చూస్తుంటారు. ఇంతలో లక్ష్మీ పెద్దాయన కోసం కాఫీ తీసుకొస్తుంది. కాఫీ చాలా బాగుందని పెద్దాయన లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తారు. ఇంతలో తన తండ్రికి అవార్డు ఇచ్చిన వార్తను కనకం మహాలక్ష్మీ టీవీలో చూస్తుంది. తండ్రి సన్మానం చూసిన కనకం ఎమోషనల్ అయిపోతుంది. పెద్దాయన కూడా ఆయన్ను పొగడటంతో కనకం చాలా సంతోషిస్తుంది. 


లక్ష్మీ: మనసులో.. చాలు నాన్న ఇది చాలు నీ సంతోషంలో పాలు పంచుకోలేకపోయానని అనుకున్నాను. నా కళ్లతో ఇంత పెద్ద విజయాన్ని చూడలేకపోయానని బాధ పడ్డాను. కనీసం ఈ విధంగా అయినా చూసే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నాకు ఇది చాలు.
పండు: అయ్యగారు కాఫీ తీసుకో.
పెద్దాయన: అల్రెడీ లక్ష్మీ ఇచ్చింది. లక్ష్మీని చూసి నేర్చుకో ఎప్పుడు ఏం చేయాలో.
పండు: ఊరుకోండి పెద్దయ్య ఇన్నాళ్లు నాలో లోపం కనిపించలేదు కానీ లక్ష్మీ రాగానే నా పనుల్లో లోపాలు వెతుకుతున్నారు.
పెద్దాయన: అంతే కదరా. లక్ష్మీ పని తనం చూశాకే నీ పని తనం తెలిసింది.
పండు: నా చేతితో చేసిన కాఫీ వేస్ట్ అవ్వకూడదే. కరెక్ట్ టైంకి అంబికమ్మ వస్తున్నారు ఇచ్చేస్తా. అమ్మగారు వేడి వేడి కాఫీ మీ కోసమే తీసుకొచ్చా.
అంబిక: ఎవరి కోసమో తెచ్చి నాకు ఇస్తున్నావ్ కదూ నువ్వు ఎవర్ని అయినా మోసం చేయొచ్చు కానీ నన్ను కాదు.
పండు: దొరికిపోయానే.
అంబిక: సరే కానీ మధ్యాహ్నం ప్రాజెక్ట్ పని మీద కొంత మంది వస్తున్నారు వాళ్ల కోసం భోజనం ఏర్పాటు చేయ్.


పండు లక్ష్మీ దగ్గరకు వచ్చి అంబికమ్మ భోజనాలు సిద్ధం చేయమన్నారని ఈ సారికి వంటలు చేసి ఆఫీస్‌కి తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తాడు. లక్ష్మీ ఒప్పుకుంటుంది. లక్ష్మీ వంటలు చేస్తుంటే సహస్ర అటుగా వస్తూ వంటల వాసన అదిరిపోతుందని ఇంత గొప్పగా ఎవరు వండుతున్నారని అనుకుంటూ కిచెన్‌కి వెళ్తుంది. లక్ష్మీని దగ్గరకు వెళ్లి నువ్వేనా ఇంత గొప్పగా చేస్తుంది అని విషయం అడిగి తెలుసుకుంటుంది. 


ఇక సహస్ర లక్ష్మీ రాశి అడిగి తెలుసుకొని ఈ ఏడాది నీ జాతకం ఎలా ఉంటుందో చూస్తానని అంటుంది. ఫోన్‌లో వీడియో పెడుతుంది.. అందులో ఈ ఏడాది రాశికి చాలా బాగుందని అత్తుత్తమ స్థానంలో ఉన్న తన జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నారని చెప్తాడు పంతులు. చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నా చివరకు మంచి జరుగుతుందని చెప్తారు. అది విని లక్ష్మీ షాక్ అయిపోతుంది. సహస్ర లక్ష్మీతో నీకు రాకుమారుడు రాబోతున్నాడట తాతయ్యకి చెప్పి మంచి సంబంధం తీసుకురమ్మని చెప్తుంది. రాకుమారుడు రాకపోయిన ఆయన దగ్గర పని చేసే వాడు వస్తాడని మీ లాంటి వాళ్లకి అలాంటి వాళ్లే వస్తారని అంటుంది. నుదిటి మీద ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందని లక్ష్మీ అంటుంది. ఇక సహస్ర ఇంట్లో అన్ని విషయాల్లో దూరిపోవద్దని తన తల్లి విషయాల్లో అస్సలు దూరొద్దని చెప్తుంది.


అంబిక ఆఫీస్‌కు వెళ్తుంది. ఇక తన లవర్‌ సుభాష్‌కి కాల్ చేసి ఆఫీస్‌కు తొందరగా రమ్మని చెప్తుంది. సుభాష్ అంబిక క్యాబిన్‌కి వస్తాడు. ఇద్దరూ విహారి ఆఫీస్‌కి వస్తాడా రాడా అని అనుకుంటాడు. అంబిక విహారికి కాల్ చేస్తుంది. ఆఫీస్‌కి వస్తున్నావా అని అడుగుతుంది. వస్తున్నాను అని విహారి చెప్తాడు. మరోవైపు లక్ష్మీ వంటలు చేసి కారులో పెట్టుకొని బయల్దేరుతుంది. పండుకి లక్ష్మీ ఆఫీస్‌లో ఎవరెవరు ఉంటారని అడుగుతుంది. అంబిక ఒక్కర్తే ఉంటుందిని పండు చెప్తాడు. విహారి ఉండడని లక్ష్మీ రిలాక్స్ అయిపోతుంది. మరోవైపు ఆదికేశవ్, గౌరీ ఆటోలో వెళ్తారు. ఆదికేశవ్ లక్ష్మీ గురించి తలచుకొని బాధపడతాడు. ఇంతలో విహారి కంపెనీకి ఉన్న పెద్ద పోస్టర్ చూసి ఆటో ఆపుతాడు.  అల్లుడు ఫొటో కనిపించేలా ఫొటో తీసుకుంటాడు. అతనిదే ఆ కంపెనీ అయింటుందని ఆటో డ్రైవర్ అంటాడు. ఆ కంపెనీ దగ్గరకు తమని తీసుకెళ్లమని ఆటో డ్రైవర్‌తో ఆదికేశవ్ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: మామ కోడళ్ల మాటల యుద్ధం.. క్రిష్‌ మాటలకు భయపడుతున్న సత్య, రుద్ర ఎందుకు టెన్షన్ పడుతున్నాడో!