Guppedanta Manasu  Serial Today Episode: శారీలో వచ్చిన వసుధారను చూసి రంగ ఈ శారీ మీకు బాగుంది.. ఇది ఎప్పుడు కొన్నారు అని అడుగుతాడు. ఉదయం సరోజ గిఫ్టుగా ఇచ్చింది ఇదే శారీ అని వసుధార చెప్పడంతో సరోజ షాక్‌ అవుతుంది. సరోజ ఇచ్చిన శారీనా చాలా బాగుంది అంటాడు రంగ.


సరోజ: ఏయ్‌ మళ్లీ ఎందుకు వచ్చాను. హైదరాబాద్‌లో చూడటానికి చాలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ అక్కడే ఉండకా మళ్లీ ఎందుకొచ్చావు. బావ దీన్ని మళ్లీ ఎందుకు తీసుకొచ్చావు.


వసుధార: హలో నీ ప్రాబ్లమ్‌ ఏంటి? ఈ ఊరికి బయటి వాళ్లు రాకూడదని ఏమైనా రూల్‌ ఉందా? ఎవరైనా ఎక్కడైనా బతికే హక్కు ఉంది.


సరోజ: అయితే ఎక్కడైనా బతుకొచ్చు కదా? మా ఊరికి ఎందుకు వచ్చావు. మా బావ ఇంటికి ఎందుకు వచ్చావు.


వసుధార: నేనేం ఊరికే రాలేదు. మీ బావ ఇంట్లోనే టెర్రస్‌ మీద అద్దెకు ఉంటున్నాను.


సరోజ: అద్దెకు ఉంటున్నావా? నీ ముష్టి అద్దె మాకేం వద్దులే


వసుధార: ఆవేశపడకు సరోజ. ఆల్‌రెడీ రెంట్‌కు ఉంటున్నట్లు అగ్రిమెంట్‌ కూడా అయింది.


  అనగానే సరోజ కోపంగా తిడుతూ రంగాను ఎందుకు అద్దెకు ఇచ్చావని అడుగుతుంది. మీ నాన్నకు వడ్డీ డబ్బులు ఇవ్వడానికి మాకు డబ్బులు కావాలి కదా ఈ రకంగానైనా మాకు డబ్బులు మిగులుతాయి కదా అంటాడు రంగ. మేడం గారు ఇక్కడే ఉంటారు అని చెప్పి వెళ్లిపోతాడు రంగ. ఎందుకు సరోజ నామీద నీకు అంత కోపం అని నీ బావ రంగా అయితే నన్ను అక్కడే వదిలేసి వచ్చేవారు. కానీ తను నా రిషి సర్‌ అని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. మరోవైపు అనుపమ తమ పెద్దమ్మ దగ్గర తనకు ఫోన్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది దేవయాని అని వసుధార వెళ్తూ మనుకు నిజం చెప్పడానికి లెటర్‌ రాసిందని ఆ లెటర్‌ వాళ్లకు దొరికిందని చెప్తుంది. దేవయాని తనకు వార్నింగ్‌ ఇచ్చిందని ఇక తను మను ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్తుంది. ఇంతలో మహేంద్ర ఫోన్‌ చేస్తాడు.


మహేంద్ర: ఏంటి అనుపమ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదు..


అనుపమ: ఏం లేదు..


 మహేంద్ర: సరే ఎక్కడ ఉన్నావు.


అనుపమ: ఉన్నాను..


మహేంద్ర: సరే త్వరగా ఇంటికి రా..


అనుపమ: మహేంద్ర ఇక నుంచి నువ్వు నా కోసం ఎదురుచూడకు.. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకో.. నేనే నీకు ఫోన్‌ చేస్తాను. నేను రావాలనుకున్నప్పుడే వస్తాను.


ALSO READ: రజినీకాంత్ ఆఫ్‌ స్క్రీన్‌ డ్యాన్స్ ఎప్పుడైనా చూశారా? అంబానీ ఇంట పెళ్లంటే అంతే మరి!


అంటూ ఫోన్‌ కట్‌ చేస్తుంది. తర్వాత మను ఏదో ఆలోచిస్తుంటే మహేంద్ర వస్తాడు.


మహేంద్ర: మను ఎప్పుడొచ్చావు..


మను: ఇప్పుడే వచ్చాను సార్‌


మహేంద్ర: మీ అమ్మ కోసం చూస్తున్నావా? తను ఇంట్లో లేదు. ఫోన్‌ చేసి అడిగితే తను వింతగా మాట్లాడుతుంది. అసలు తను అలా ఎందుకు మాట్లాడిందో నాకు అర్థం కావడం లేదు.


మను: మీరు మేడం గారిని ఏమైనా అన్నారా? సార్‌..


 మహేంద్ర: అలాంటిదేం లేదు మను. అయినా నేను తననెందుకు అంటాను. నేనే బాధలో ఉంటే నాకు అండగా ఉంటున్న తనని నేను కష్టపెడతానా? తను ఎక్కడుందో కూడా చెప్పలేదు.


మను: తను ఎక్కడుంటారో నాకు తెలుసు సార్‌. మీరేం కంగారు పడకండి.


అని మను వాళ్ల బామ్మకు ఫోన్‌ చేసి అనుపమ మేడం ఉన్నారా? అని అడగ్గానే ఉందని చెప్తుంది. దీంతో మహేంద్ర సార్‌ బాధపడతున్నారు ఇక్కడికి రమ్మనండి అని మను చెప్పగానే అనుపమ ఫోన్‌ తీసుకుని నువ్వే ఇక్కడికి రా అంటుంది. మను సరే అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు వసుధార చుట్టుపక్కల పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ చెప్తుంది. దీంతో అందరూ వచ్చి వసుధారను మెచ్చుకుంటారు. సరోజ కుళ్లుకుంటుంది. మరోవైపు మను అనుపమ దగ్గరకు వస్తాడు. మనం ఇక్కడే ఉందామని మహేంద్ర దగ్గరకు ఇక వెళ్లొద్దని అనుపమ చెప్పగానే.. ఒంటరిగా ఉన్న మహేంద్ర సార్‌ను నేను వదిలేయలేనని మాట తప్పనని మను చెప్పడంతో.. నువ్విప్పుడు నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అనుపమ అనగానే మను షాక్‌ అవుతాడు.  ఇక్కడితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.