Gruhalakshmi Telugu Serial Today Episode: ఇంట్లో పని మనిషి రాములమ్మ లాస్య గురించి మాట్లాడుతుంటే.. లాస్య గురించి ఏం మాట్లాడొద్దు అంటుంది తులసి. దీంతో రాములమ్మ కోపంగా లాస్యను తిడుతుంది. ఇంతకుముందే మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టిందో మీకు తెలియంది కాదు. అయినా మళ్లీ ఆమెనే వెనకేసుకొస్తున్నారు మీరు అంటుంది రాములమ్మ.


రాములమ్మ: కొత్త డాక్టర్‌ ను అడ్డుపెట్టుకుని లాస్యమ్మ నాటకమాడుతుందని నా మనసుకు తెలుస్తుంది. ఆ కొత్త డాక్టర్‌ వైద్యం మొదలెట్టాకే పెద్దయ్యగారు లాస్యమ్మను కలవరించడం మొదలుపెట్టారు. మీరే బాగా ఆలోచించండి.


అంటూ రాములమ్మ చెప్తుండగానే అక్కడకు అనసూయ వస్తుంది.


అనసూయ: అవును తులసి. రాములమ్మ చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. అంతకుముందు ఎప్పుడూ లాస్య గురించి పట్టించుకోని మీ మామయ్య కొత్త డాక్టర్‌ ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాకే లాస్య గురించి మాట్లాడుతున్నారు.


తులసి: మీరు చెప్పదలచుకుంది ఏంటి అత్తయ్య.. తెలిసిని డాక్టర్‌ కాబట్టి లాస్య కొత్త డాక్టర్‌ను మేనేజ్‌ చేసి ఉంటుంది అంటే నమ్ముతాను. కానీ అల్జీమర్స్‌ తో బాధపడుతున్న మామయ్యని డాక్టర్‌ ఎలా మేనేజ్‌ చేస్తారు. అది కుదిరే పనేనా?


అనగానే అనసూయ, రాములమ్మ ఇద్దరూ కలిసి తులసిని తిడతారు. నువ్వు పాత తులసివేనా అంటూ ప్రశ్నిస్తారు. దీంతో తులసి కన్వీన్స్‌ అయ్యి అయితే కొత్త డాక్టర్‌ రిపోర్ట్‌ అన్నీ మరో డాక్టర్‌కు చూపిద్దామని చెప్తుంది. దీంతో అలాగే చేద్దామని అనుకుంటారు. ఈ విషయం లాస్యకు తెలియకుండా జాగ్రత్త పడాలనుకుంటారు.


మరోవైపు దివ్య బాధపడుతూ.. ఫోన్‌లో తులసి ఫోటో చూస్తూ.. ఏడుస్తుంది. విక్రమ్‌ వచ్చి దివ్యను ఓదారుస్తూ..


విక్రమ్‌: మనం సరదాగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో?


దివ్య: నీకింకా ఆ విషయం గుర్తుందా? నేనెప్పుడో మర్చిపోయాను మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తాయన్న ఆశ కూడా లేదు.


విక్రమ్‌: ఎందుకంత నిరాశ


దివ్య: అది నిరాశ కాదేమో? దురాశ అనుకుంటున్నాను. పిచ్చి తగ్గట్లేదు అనుకోవడం నిరాశ? మళ్లీ ఎప్పటిలాగే ఉండాలనుకోవడం దురాశ.


విక్రమ్‌: జీవితం ఎప్పుడూ ఒకేళా ఉండదు.


దివ్య: ఆ నిజం నాకు ఈ మధ్యనే తెలిసింది. ముందు డైజెస్ట్‌ కాలేదు. ఆ తర్వాత అలవాటు అయిపోయింది.   


  అనగానే నువ్వు యాక్సిడెంట్‌ చేసిన అమ్మాయి ఎలా ఉంటుందో నువ్వు గుర్తు పట్టగలవా? అంటూ విక్రమ్‌ అడగ్గానే.. దివ్య షాక్‌ అవుతుంది. అదేంటి అసలు నేను యాక్సిడెంట్‌ చేశానంటేనే నమ్మలేదు. ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నారు అనగానే నువ్వు యాక్సిడెంట్‌ చేశావని నేను నమ్ముతున్నాను. అనగానే దివ్య హ్యాపీగా ఫీలవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతుంది దివ్య. ఏం లేదు. నేనో మంచి ఆర్టిస్టును తీసుకొస్తాను ఆ చనిపోయిన అమ్మాయి ఫోటో వేయిద్దాం తర్వాత ఏం జరగాలో చూద్దాం అంటాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న సంజయ్‌ షాక్‌ అవుతూ వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలని రాజ్యలక్ష్మీ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్తాడు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ రాజ్యలక్ష్మీ, బసవయ్య షాక్‌ అవుతారు. మరోవైపు లాస్య, బసవయ్య చెస్‌ అడుతుంటారు. దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న అనసూయ, తులసిలు డాక్టర్‌ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో డాక్టర్‌ వస్తాడు. డాక్టర్‌ కు తులసి  జరిగిందంతా చెప్తుంది.


తులసి: అత్తయ్య లాస్య ముఖం చూశారా? టెన్షన్‌ పడుతుంది.


అనసూయ:  దొరికిపోతుంది చూడు.


తులసి: ఇది మామయ్యగారి ఫైల్‌. ట్రీట్‌మెంట్‌కు సంబంధించి అన్ని వివరాలు ఉన్నాయి. మీ ఒపినియన్‌ కోసం మిమ్మల్ని పిలిపించాం.


అని తులసి డాక్టర్‌కు చెప్పగానే ఆయన ఫైల్‌ మొత్తం చూసి ఈ డాక్టర్‌ను మీకు సజెస్ట్‌ చేసింది ఎవరని అడగ్గానే తులసి, లాస్యను చూపిస్తుంది. డాక్టర్‌ అనుమానంగా లాస్య దగ్గరకు వెళ్తుంటే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. డాక్టర్‌.. లాస్య దగ్గరకు వెళ్లి ఎక్సలెంట్‌ మేడం మీరు పేసెంట్‌కు మళ్లీ పునర్జన్మను ఇచ్చారు. మంచి డాక్టర్‌ను సజెస్ట్‌ చేశారు. అంటూ తులసికి కూడా ఈ డాక్టర్‌ను కళ్లు మూసుకుని నమ్మేయొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో లాస్య ఏడుస్తున్నట్లు నటిస్తూ.. పరంధామయ్యతో ఇంట్లోంచి వెళ్లిపోతానంటుంది. దీంతో పరంధామయ్య   కూడా నేను నీతో పాటు వస్తాననడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Readసర్కారు నౌకరి రివ్యూ: సింగర్ సునీత కొడుకు ఆకాష్ మొదటి సినిమా