'సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ, చంటిగాడు లోకల్' - 'ఇడియట్' సినిమాలో మాస్ మహారాజా రవితేజ చెప్పే డైలాగ్ ఇది. దీన్ని కొంచెం మార్చి 'జబర్దస్త్ షోకి ఎంతో మంది జడ్జ్‌లు వస్తుంటారు పోతుంటారు. కానీ, కామెడీ మాత్రం సూపర్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇప్పటి వరకు వచ్చిన జడ్జ్‌లతో కంపేర్ చేస్తే... కొత్త జడ్జ్ శివాజీ కొంచెం స్పెషల్ అని చెప్పాలి. వచ్చీ రావడమే, మొదటి ఎపిసోడ్ నుంచి ఆయన పంచ్ డైలాగులతో చెలరేగిపోయారు. టీమ్ లీడర్లతో మింగిల్ అయ్యారు, సెటైర్స్ వేశారు.


నేను పోతాను అన్నయ్యా పోతాను
ఈటీవీ షో కోసం వినాయక చవితి సందర్భంగా మల్లెమాల టీవీ సంస్థ స్పెషల్ ఈవెంట్ 'జై జై గణేశా' చేసింది. దానికి శివాజీ వచ్చారు. యాంకర్ రష్మీ గౌతమ్ డ్యాన్స్ కోసం 'జబర్దస్త్' షో చూడటం స్టార్ట్ చేశానని శివాజీ చెప్పారు. దాని మీద 'కెవ్వు' కార్తీక్ పంచ్ వేశాడు. స్టేజి మీద స్కిట్ చేస్తుండగా ఫోనులో చూస్తుంటాడు కార్తీక్. పక్కన మరో కమెడియన్ ఏంటి? అని అడిగితే... 'రష్మీ డ్యాన్స్ చూస్తున్నా' అని సమాధానం ఇస్తాడు. వెంటనే 'జై జై గణేశా' ఈవెంట్ విజువల్స్ ఫ్లాష్ అయ్యాయి. శివాజీకి కూడా తాను చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. దాంతో 'నేను పోతాను అన్నయ్యా నేను పోతాను' అని సీటు లోనుంచి లేచారు.


రాఘవ అంత యంగ్ కాదయ్యా నేను
'రాకెట్' రాఘవ అయితే తనది, శివాజీది ఒకటే వయసు అన్నట్టు, తామిద్దరం యంగ్ అన్నట్టు చెప్పుకొచ్చారు. 'టీమ్ లీడర్ ని ఏంటి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు' అని రాఘవ టీంలో కమెడియన్ డైలాగ్ వేస్తే... 'టీమ్ లీడర్ కాదు, జడ్జ్ గారు! ఏదో నాలా యంగ్ గా ఉంటారు ఆయన' అని రాఘవ అన్నాడు. ఆ తర్వాత శివాజీ రంగంలోకి దిగారు. వెంటనే పంచ్ వేశారు. 



'మరీ నీ అంత యంగ్ కాదు రాఘవా నేను. ఎప్పుడో ఎస్వీ రంగారావు గారు... మీరూ!' అంటూ శివాజీ డైలాగ్ వేయడంతో రాఘవ రెండు చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని నవ్వేశారు. 'నాటీ' నరేష్ వేసిన క్రింజ్ కామెడీ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ మీద శివాజీ ఇచ్చిన రియాక్షన్స్ కూడా ఫన్ క్రియేట్ చేశాయి.


శివాజీని స్టేజి మీదకు యాంకర్ రష్మీ గౌతమ్ సహా టీమ్ లీడర్లు అందరూ సాదరంగా స్వాగతం ఇచ్చారు. ఆ తర్వాత రాఘవ 'నాకు చాలా బాధగా ఉంది సార్' అన్నాడు. 'ఎందుకు? నేను జడ్జ్‌గా వచ్చాను అనా? లేదంటే నేను కూడా జడ్జ్‌గా వచ్చాను అనా' అని అన్నారు శివాజీ. దాంతో అందరూ నవ్వేశారు.


Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా



శివాజీ దెబ్బకు ఖుష్బూ కనిపించలేదుగా!
శివాజీ రాకతో మరొక జడ్జ్ ఖుష్బూ అసలు కనిపించలేదు. సాధారణంగా ప్రోమో విడుదలైనప్పుడు ఆవిడ టీమ్ లీడర్స్ మీద వేసిన సెటైర్లు కనిపిస్తాయి. ఈ లేటెస్ట్ ప్రోమోలో ఒక్క బుల్లెట్ భాస్కర్ మీద వేసిన పంచ్ మాత్రమే హైలైట్ అయ్యింది. శివాజీ చెలరిగితే ఆవిడ పక్కన కూర్చుని ఆ పంచ్ డైలాగ్స్ ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు.


Also Readతెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?