సోషల్ మీడియాలో మ్యాగ్జిమమ్ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ల జాబితా తీస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) పేరు ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఆవిడ నెల నుంచి అంత యాక్టివ్‌గా ఉండటం లేదు... గమనించారా? అసలు ఆవిడ సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా?


ఆగస్టులో రష్మికకు యాక్సిడెంట్!
పబ్లిక్‌లోకి తాను వచ్చి లేదంటే సోషల్ మీడియాలో కనిపించి చాలా రోజులు అయ్యిందని రష్మిక అంగీకరించారు. అందుకు కారణం తనకు చిన్న యాక్సిడెంట్ కావడం అని ఆవిడ వివరించారు. 


యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్స్ సలహా మేరకు తాను ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకున్నానని రష్మిక తెలిపారు. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, తన ఆరోగ్యం బావుందని, సూపర్ యాక్టివ్ అయ్యానని రష్మిక తెలిపారు. జీవితం చాలా చిన్నదని, రేపు ఏం జరుగుతుందో తెలియదు కనుక ఇవాళ సంతోషంగా ఉండమని ప్రేక్షకులకు సలహా ఇచ్చారు. ప్రస్తుతం లడ్డూలు ఎక్కువ తింటున్నానని కూడా రష్మిక చెప్పారు. వినాయక చవితి కదా!


Also Read: తెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?






చెల్లెలితో ఫోటోలు షేర్ చేసింది అందుకేనా?
రష్మిక రీసెంట్‌గా ముంబైలో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్ వేసుకుని స్మైల్ ఇస్తూ కనిపించారు. ఓ మూడు వారాలు వెనక్కి వెళితే... సోషల్ మీడియాలో తన చెల్లెలితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది. అందుకు కారణం ఇంట్లో ఉండటమే అని ఇప్పుడు చేసిన పోస్ట్ బట్టి అర్థం అవుతోంది.


Also Readముంబైలో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా మీటింగ్ - 'దేవర'తో 'యానిమల్' దర్శకుడు సినిమా తీస్తే....






ఇప్పుడు రష్మిక చేస్తున్న సినిమాలు ఏమిటి?
Rashmika Mandanna Upcoming Movies List: ప్రస్తుతం రష్మిక మందన్నా చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. అందులో అన్నిటి కంటే ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేది... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప: ది రూల్' (Pushpa 2 Movie). 'పుష్ప: ది రైజ్' విజయం సాధించడంతో పాటు బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇది కాకుండా తెలుగు, తమిళ భాషల్లో 'రెయిన్ బో', 'ది గర్ల్ ఫ్రెండ్', హిందీలో 'చావా', సల్మాన్ ఖాన్ 'సికిందర్'తో పాటు ధనుష్, నాగార్జునల పాన్ ఇండియా సినిమా 'కుబేర' చేస్తున్నారు.