chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode లక్ష్మి ఆకులు తీస్తుంటే ముళ్లు గుచ్చుకొని రక్తం వస్తుంది. దాంతో మిత్ర జాలి పడి తాను ఆకు తెంపుతూ తన చేయి లక్ష్మిని పట్టుకోమని అంటాడు. దాంతో ఆకు తెంపి లక్ష్మికి ఇస్తాడు. లక్ష్మి అందరి కాళ్లకు పసుపు రాసి ఆశీర్వాదం తీసుకుంటుంటే మిత్ర చూసి తన భర్త కోసం తను చాలా కష్టపడిందని ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయి ఉండటం గ్రేట్ అనుకుంటాడు. ఇక అరవింద లక్ష్మీకి ప్రసాదం వండుతుంది. మిత్ర లక్ష్మిని అలా చూడటం అరవింద చూసి మిత్ర దగ్గరకు వెళ్తుంది. 


మిత్ర: ఒక మనిషిని ప్రేమిస్తే ఇంత కఠినమైన దీక్ష చేస్తారా. ఒక మనిషిని బాగుండాలి అని ఆ మనిషి కోసం ఇంత కష్టపడతారా. ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా.
అరవింద: జీవితం అంటే అంతే మిత్ర. కొన్ని బంధాలు అలా వచ్చి ఇలా పోతాయి. మరి కొన్ని జన్మజన్మలకు ఉండిపోతాయి. అలాంటి వాటి కోసం ఎంత చేసినా తక్కువే. ఆ అమ్మాయి కూడా అంతే తన భర్త కోసం ఇంత చేస్తుంది.
మిత్ర: మామ్ ఇదంతా చూస్తూ నా వల్ల కావడం లేదు. మనం వచ్చిన పని అయిపోతే వెళ్లిపోతా. 


అరవింద దీక్షితులు గారికి చెప్పి వెళ్లాలని వెళ్తుంది. లక్ష్మిని ఎవరో అనుకొని పొగుడుతుంది. తనని చూస్తే లక్ష్మి గుర్తొస్తుందని అంటుంది. దీక్షితులు గారు మనసులో తనే మీ లక్ష్మి అని అంటారు. అత్త మాటలు విని లక్ష్మి ఎమోషనల్ అవుతుంది. ఇక జాను వివేక్‌ని జున్ను ఇంటికి రమ్మని పిలుస్తుంది. వివేక్ వస్తాడు. 


జాను: వివేక్ అక్క ఇక్కడే ఉంది. ఈ ఇంట్లోనే.. జున్ను వాళ్ల అమ్మే మా అక్క. 
వివేక్: జాను ఆర్‌యూ మ్యాడ్. మీ అక్కని చూశాను అన్నావు. ఇప్పుడేంటి ఏకంగా జున్ను వాళ్ల అమ్మ మీ అక్క అంటున్నావు. 
జాను: అయ్యో వివేక్ నేను చెప్పింది నిజం అక్క బతికే ఉంది ఈ ఇంట్లోనే ఉంది. 


జాను వివేక్‌తో జున్ను తనతో చెప్పిన మాటలు వివేక్‌కి చెప్తుంది. అర్జున్, లక్ష్మి భార్య భర్తలు కాదని చెప్తుంది. ఇక వివేక్, జాను లోపలికి వెళ్తారు. జున్ను లక్కీ వీడియో పంపించిందని ఆ వీడియో జాను, వివేక్‌లు చూస్తారు. అందులో లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. జాను జున్నుని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతుంది. వదిన అలా ఎందుకు ఉందో తెలిసే వరకు జున్ను వాళ్లతో ఈ విషయం మాట్లాడొద్దని వివేక్ జానుతో చెప్తాడు. వసుంధర అక్కడికి రావడంతో లక్ష్మి ఎక్కడికి వెళ్లిందని అడిగి గుడికి వెళ్లిందని తెలుసుకొని జాను, వివేక్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మిత్ర ఇంటికి వచ్చి లక్ష్మీ గురించే ఆలోచిస్తూ మనీషా పిలిచినా పలకకుండా వెళ్లిపోతాడు. మనీషా గట్టిగా పిలిస్తే తన మూడ్ బాలేదని విసిగించొద్దని చెప్పి వెళ్లిపోతాడు. ఇక దేవయాని ఏమైందని అరవిందతో అడుగుతుంది. దాంతో అరవింద గుడిలో పూజ గురించి మహా ఇళ్లాలిని చూసి ఆశ్చర్యంలో ఉన్నాడని అంటుంది. అరవింద కూడా లక్ష్మీని పొగిడేస్తుంది. లక్ష్మీ కూడా గతంలో మిత్ర కూడా ఇలాగే చేసిందని నీ లాంటి వాళ్లే కాకుండా లక్ష్మీ లాంటి వాళ్లు కూడా ఉన్నారని అంటుంది. 


లక్కీ లక్ష్మీ ఉన్న వీడియో చూస్తూ మిత్ర దగ్గరకు వెళ్తుంది. మిత్ర డల్‌గా ఉండటం చూసి లక్ష్మీ కనిపించేలా వీడియో ఫాజ్ చేసి మిత్రతో మాట్లాడుతుంది. ఇక జాను, వివేక్‌లు లక్ష్మీ గురించి మాట్లాడుతూ గుడి దగ్గరకు బయల్దేరుతారు. ఇక అరవిందకు విషయం చెప్తానని జాను అంటే వివేక్ వద్దు అనేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: యువరాజ్‌ డబ్బు పట్టుకోకుండా అడ్డుకున్న ధాత్రి.. అతడు బతికే ఉన్నాడని నిరూపిస్తుందా!