గత కొన్ని సీజన్లుగా 'ఢీ' షోకి యాంకర్లుగా, టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తోన్న సుడిగాలి సుధీర్, రష్మీ తరువాతి సీజన్ నుంచి కనిపించరని సమాచారం. వ్యక్తిగత కారణాల వలన ఈ కాంబో 'ఢీ' షో నుంచి తప్పుకుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ.. రష్మీ, సుధీర్ ఇక 'ఢీ' షోపై కనిపించరని మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సుధీర్ స్థానంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ను తీసుకున్నారని సమాచారం. హైపర్ ఆది, అఖిల్ సార్థక్ లపై ప్రోమో షూటింగ్ కూడా జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై కాలారిటీ రానుంది. 


ఇటీవలే 'ఢీ' 13 షోకి సంబంధించిన ఫినాలే జరిగింది. ఈ ఈవెంట్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. దీంతో షోకి మరింత కల వచ్చింది. బన్నీ స్టేజ్ పైకి రాగానే ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఒకట్రెండు స్టెప్స్ వేసి ఫ్యాన్స్ ను అలరించారు బన్నీ. తన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ షోలో కావ్య శ్రీ అనే అమ్మాయికి టైటిల్ దక్కింది. ఆమెకి అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా 'ఢీ13' లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రతీ రౌండ్ లో తన టాలెంట్ చూపిస్తూ.. ఫైనల్స్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చి విజేతగా నిలిచింది. 


బన్నీ ట్రోఫీ అందిస్తున్న సమయంలో స్టేజ్ మొత్తం సందడి వాతావరణం నెలకొంది. షోకి సంబంధించిన ప్రతీ ఒక్కరు బన్నీని కలుస్తూ ఫొటోలు దిగారు. ఇదే సందర్భంలో రష్మీ కూడా బన్నీని కలిసింది. ఆమె చేయి పట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు బన్నీ. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 







 


Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?