'మేజర్' మళ్లీ షురూ.. 


హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. గురువారం నుండి సినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. 






Also Read : Thalapathy Vijay : విజయ్ తో ధోనీ.. సినీ, క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. ఫోటోలు వైరల్


లావణ్యకు ట్రిపోఫోబియా.. 


అందరిలానే సినిమా ఇండస్ట్రీలో పని చేసే వారికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. హీరోయిన్లలో చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి. కానీ వాటిని బయటకు చెప్పరు. కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు తమలోని లోపాలను బయటపెట్టారు. నటి లావణ్య త్రిపాఠి తనకు ట్రిపోఫోబియా ఉందన్న విషయాన్ని వెల్లడించింది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన లావణ్య.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో తనకు ట్రిపోఫోబియా ఉందని.. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే తనకు భయం కలుగుతుందని చెప్పింది. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని వెల్లడించింది. 






Also Read :- Vijay Sethupathi: బాలయ్య కోసం సరైన విలన్.. గోపీచంద్ ప్లాన్ మాములుగా లేదు..


సిద్ధార్థ్ - కియారాల రొమాంటిక్ వీడియో.. 


హీరోయిన్ కియారా అద్వానీ.. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'షేర్షా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా కియారా-సిద్ధార్థ్ కలిసి ఓ రీల్ వీడియో చేశారు. ఇందులో 'షేర్షా' సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉండగా.. కియారా అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. వెనుక నుండి సిద్ధార్థ్ వచ్చి కియారా చేయి పట్టుకొని రొమాంటిక్ గా వెనక్కి లాగుతాడు. ఈ వీడియోలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. ఇది చూసిన నెటిజన్లు వీరిద్దరినీ పొగుడుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.