కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది 'మాస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో 'బీస్ట్' సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ చెన్నైలోని గోకులం స్టూడియోస్ లో జరుగుతోంది. అదే స్టూడియోకి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కూడా వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


గురువారం నాడు 'బీస్ట్' సినిమా సెట్స్ లో కనిపించారు ధోనీ. కాసేపు విజయ్ తో ముచ్చటించారు. కమర్షియల్ షూట్ లో పాల్గొనడానికి వెళ్లిన ధోనీ.. అక్కడే విజయ్ షూటింగ్ జరుగుతుందని తెలుసుకొని సరదాగా ఆయన్ని కలిశారు. ప్రస్తుతం ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్స్ తో కలిసి చెన్నైలోనే ఉంటుంది. త్వరలోనే వీరంతా మ్యాచ్ కోసం దుబాయ్ కి పయనమవనున్నారు. 


Also Read : Independence Day Songs: ''మా తుఝే సలాం..'' 75వ స్వాతంత్య్ర వేడుకలకు 'దేశం' స్పెషల్..


ధోనీ చెన్నైలో తనకు తెలిసిన మరికొంతమంది స్నేహితులను కూడా కలుస్తున్నారు కానీ విజయ్ ని కలవడం ఇప్పుడు వీర్ల అవుతోంది. వీరిద్దరూ కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2008లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లాంచ్ చేసినప్పుడు విజయ్ ఆ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ తరువాత విజయ్, ధోనీ కలుసుకోవడం ఇదే తొలిసారి.


ధోనీ స్నేహితుడు సీమంత్ లొహానీ ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు తలపతితో తల అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు. విజయ్ ని ఫ్యాన్స్ అంతా తలపతి అని పిలుస్తారు. అలానే ధోనీని కూడా తల అని అంటారు. ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.