'ఫస్ట్ డే ఫస్ట్ షో' కోసం మెగాస్టార్:


'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందుతోంది. దీనికి ఇద్దరు యువకులు.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 'సిరి సిరి మువ్వ', 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. 


దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేశారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. దానికి మెగాస్టార్ చిరంజీవిని అతిథిగా రానున్నారు. ఆగస్టు 31న ఈ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి హీరో తండ్రిగా నటిస్తే శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా నటించారు. 'ఫస్ట్ డే ఫస్ట్ షో'కు కేవీ అనుదీప్ కథ అందించడంతో పాటు కళ్యాణ్, వంశీధర్ గౌడ్ తో కలిసి స్క్రీన్ ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, ఆయన మాటలు రాశారు.




అమితాబ్ స్టాట్యూ కోసం రూ.60 లక్షలు ఖర్చు పెట్టిన ఫ్యామిలీ:


అమెరికాలో సెటిల్ అయిన ఓ ఇండియన్ ఫ్యామిలీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి అభిమానులు. ఆయన మీద ఉన్న అభిమానంతో ఓ స్టాట్యూ చేయించాలనుకుంటున్నారు. న్యూజెర్సీలో ఉండే వీరు రాజస్థాన్ లో ఓ వ్యక్తితో తమకు కావాల్సినట్లుగా స్టాట్యూ డిజైన్ చేయించారు. 


దీని మొత్తానికి 75 వేల అమెరికన్ డాలర్లను ఖర్చు పెట్టారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.60 లక్షలు. ఈ స్టాట్యూని తమ ఇంటి ముందు ఆవిష్కరించే సమయంలో దాదాపు 600 మంది అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్టాట్యూ ఒక గ్లాస్ బాక్స్ లో ఉండేలా ఏర్పాటు చేశారు. 




Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్