సూపర్ స్టార్ రజనీ కాంత్.. ఈ పేరుకు దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటన, స్టైల్, తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ‘అన్నతే’ సినిమా తర్వాత రజనీ కాంత్ నటిస్తోన్న సినిమా ‘జైలర్’. ఈ మూవీకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్‌లాల్, తమన్నా, యోగి బాబు, రమ్య కృష్ణన్, రెడిన్ కింగ్స్లీ తదితరులు నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నై, కడలూరు, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇదిలాఉండగా.. తాజాగా రజనీ కాంత్ సినిమాలకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


రజనీ ‘జైలర్’ తర్వాత ఏం సినిమా చేయబోతున్నారు అనే దానిపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఛైర్మన్ సుభాస్కరన్ పుట్టిన రోజు సందర్భంగా రజనీ కాంత్ ఫ్యాన్స్ కు శుభవార్తను అందించింది ఆ సంస్థ. త్వరలో రజనీ కాంత్ లైకా ప్రొడక్షన్ లో సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ తలైవా 170 చిత్రానికి టి.ఎస్.జ్ఞావవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన గతంలో ‘జై భీమ్’ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రజనీ-జ్ఞానవేల్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మూవీను 2024 లో థియేటర్లలోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ మేరకు లైకా ప్రొడక్షన్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను విడుదల చేసింది. దీంతో రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇప్పటికే రజనీ కాంత్ నటించిన ‘రోబో 2.O’, ‘దర్బార్’ వంటి సినిమాలకు లైకా సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పుడు జ్ఞానవేల్ సినిమాతో మరోసారి రజనీ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రజనీ మరో సినిమాకు పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె ఐశర్య రజనీకాంత్ దర్శకత్వంలో  తెరకెక్కనున్న ‘లాల్ సలాం’ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో  నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ మూవీ లో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీారోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ పోలీస్ నేపథ్యంలో రూపొందిస్తోన్న యాక్షన్ డ్రామా సినిమా అని సమాచారం. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అయినా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ కు మంచి హిట్ అందుతుందో లేదో చూడాలి. 



Also Read సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా