Por Thozhi: తమిళ్ దర్శకుడు విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పోర్ థోజిల్’. ఈ సినిమాలో శరత్ కుమార్, అశోక్ సెల్వన్ లీడ్ రోల్స్ లో నటించారు. నిఖిలా విమల్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ తమిళ్ లో జూన్ 9 న విడుదల అయింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ భారీ సక్సెస్ ను అందుకుంది. క్రైమ్ థ్రిల్లర్ కథను కొత్తగా చూపించడంతో మూవీను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. 


సినిమా కథేంటంటే..


ఓటీటీలు వచ్చిన తర్వాత ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో క్రైమ్, థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ బాగా పెరిగింది. తాజాగా తమిళ్ లో భారీ హిట్ అందుకున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘పోర్ థోజిల్’ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమా కథ మొత్తం ఒక సీరియల్ మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. శరత్ కుమార్ ఎస్పీగా అశోక్ సెల్వన్ డిఎస్పీగా కనిపిస్తారు. సినిమా ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తో ప్రారంభం అవుతుంది.  అయితే అలాంటి హత్యలు అదే పోలికలతో వరుసగా జరగుతూ ఉండటంతో దీని వెనక సైకో కిల్లర్ ఉన్నాడని భావిస్తారు. అక్కడ నుంచి సినిమా కథ మలుపు తిరుగుతుంది. మూవీ స్టోరీ, స్కీన్ ప్లే ను చాలా చక్కగా తీర్చిదిద్దారు దర్శకుడు. ప్రతీ సీన్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అదే సస్పెన్స్ మూవీ చివరి వరకూ కొనసాగుతోంది. ఈ మూవీ సాధారణ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఈ మూవీను తమిళ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. 


బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు..


క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత ఈజీ ఏమ్ కాదు. చెప్పాలనుకున్న విషయంలో ఏమాత్రం తడబడినా ప్రేక్షకులకు చివరి వరకూ సస్పెన్స్ లో ఉంచకపోయినా మూవీ రిజల్ట్ గాడి తప్పుతుంది. ‘పోర్ థోజిల్’ సినిమా విషయంలో దర్శకుడు విఘ్నేష్ రాజా వాటన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేశాడు. అందుకే ఈ సినిమా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లా కాకుండా కొత్తగా కనిపిస్తుంది. అందుకే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. జూన్ 9 న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఓవరాల్ గా సుమారు రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. 


వివిధ భాషల్లో అందుబాటులోకి..


ఈ మధ్య కాలంలో సినిమాల మధ్యలో భాషాబేధాలు బాగా తగ్గిపోయాయి. ఏదైనా సినిమా బాగుంటే ఇతర భాషల్లో ఉన్నా కూడా ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులు. అందుకే మేకర్స్ కూడా హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోకి కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పుడీ ‘పోర్ థోజిల్’ సినిమాను కూడా ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లీవ్ లో ఆగస్టు 11 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. 


Also Read: ‘కొటేషన్ గ్యాంగ్’ ట్రైలర్ - ‘దండుపాళ్యం’ గ్యాంగ్‌‌ను మించిపోయిన ప్రియమణి, సన్నీలియోన్ ముఠా


Join Us on Telegram: https://t.me/abpdesamofficial