Prithviraj Sukumaran To Play Villain In Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతున్నది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాను తీయబోతున్నారు జక్కన్న. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు కష్టపడుతున్నారు. తన పాత్రకు తగినట్లుగా లుక్, బాడీ షేప్ మార్చుకునేందుకు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.


నటీనటుల ఎంపికపై ఫోకస్ పెట్టిన రాజమౌళి


హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన పెద్ద పెద్ద సెట్స్ వేస్తున్నారు. అక్కడే వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేయగా,  ప్రస్తుతం యాక్టర్లు సెలక్షన్ పై రాజమౌళి కాన్సంట్రేషన్ పెట్టారు. ఇండియాతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన యాక్టర్లతో పాటు టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీని తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, వాటిని మేకర్స్ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ రోల్ కు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.


SSMB29లో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్!


ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీలో రాజమౌళి మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ను విలన్ గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ పోటీగా ఆయన సరిగ్గా సరిపోతారాని జక్కన్న భావిస్తున్నారట. ఇప్పటికే సెలక్షన్ పూర్తయినా, ఈ విషయాన్ని బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితం అయిన పృథ్వీరాజ్.. రీసెంట్ గా వచ్చిన ‘సలార్’ సినిమాతో పాన్ ఇండియా రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ప్రభాస్ తో పోటీపడి నటించిన ఆయన, తన పాన్ వరల్డ్ మూవీలో విలన్ పాత్రకు సరిపోతాడని భావించి రాజమౌళి ఎంపిక చేశారట.


కథ వినకుండానే ఓకే చెప్పిన పృథ్వీరాజ్!


అటు ఈ సినిమా స్టోరీని సుకుమారన్ కు వివరించాలని రాజమౌళి భావించారట. అయితే, ఆయన కథ వినకుండానే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఆఫర్ ఇస్తే నో చెప్పడం అనేది ఉండదన్నారట సుకుమారన్. ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారట. ఇక ఈ మూవీ దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ లో తెరకెక్కబోతోంది. కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్  ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు.



Also Read: నేను చాలా వికారంగా ఉంటాను, అదంతా నాకు అలవాటైపోయింది - నవాజుద్దీన్ సిద్ధికి