Sridevi Drama Company Promo:  ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘జబర్దస్త్’ కమెడియన్లు ఈ షోలో చేసే ఫన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20న ప్రసారం కానున్న ఈ షో అందరినీ నవ్వుల్లో ముంచెత్తనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే, మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు థీమ్స్ తో ఈ వారం షో ప్రేక్షకులను అలరించబోతోంది.


ప్రభాస్ బర్త్ డే హంగామా


ప్రోమో ప్రారంభం కాగానే తాగుబోతు రమేష్, నాటి నరేష్ ప్రభాస్ గురించి అదిరిపోయే ఎలివేషన్ ఇస్తారు. “ప్రభాస్ గారికి నేను వీరాభిమానని. ఆయనంటే కోసుకుంటా. బర్త్ డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి” అంటారు రమేష్. ఆ వెంటనే యాంకర్ రష్మీ గౌతమ్, ఇంద్రజ ఇంట్రో ఆకట్టుకుంటుంది. కమెడియన్లు అంతా కలిసి రిచ్, పూర్ జట్లుగా విడిపోయి ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తారు. “మాకు లేదు బొచ్చు, మేం రిచ్చు” అని ఇమ్మాన్యుయేల్ చెప్పడంతో అందరూ నవ్వుతారు. ప్రభాస్ బర్త్ డే తాము సెలబ్రేట్ చేస్తామంటే, తాము చేస్తామంటూ రిచ్, పూర్ టీమ్ లు పడే గొడవ ఫన్నీగా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పాటలకు కంటెస్టెంట్లు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఆయా సినిమాల్లో ప్రభాస్ చేసిన పాత్రలను హైలెట్ చేస్తూ ఇచ్చిన ఫర్ఫార్మెన్స్ అందరినీ అలరించింది. ‘కల్కీ 2898 ఏడీ’ సినిమాలోని బుజ్జి వచ్చి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసేందుకు 5 వేల యూనిట్లు కావాలని అడగడం” ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ సినిమాలోని పాటలను పాడుతూ సింగర్స్ ఎంటర్ టైన్ చేశారు. ఇక ఈ షోలో ఆడిన ఫన్నీ గేమ్స్ అందరినీ నవ్వించాయి.



అలరించిన మెగాస్టార్ గిన్నిస్ రికార్డ్ థీమ్


గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ హోల్డర్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ.. ప్రారంభం అవుతుంది. చిరంజీవి పాటలకు వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మెగా రెబల్ ఎపిసోడ్ ఈ నెల 20న ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం కానుంది.   


అటు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌ లో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురయ్యింది. హాలీవుడ్ మూవీస్ నుంచి కాపీ కొట్టారంటూ విమర్శలు వచ్చాయి.     



Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?