SDT 18 Making Video: మెగా హీరో సాయి దుర్గ తేజ్ కాస్త గ్యాప్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రోహిత్ కె.పి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నారు. సాయి తేజ్ కెరీర్ లో 18వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను... ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్

  భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మూవీలో అందాల తార ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇవాళ సాయి దుర్గ తేజ్ బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు.  


కళ్లు చెదిరేలా విజువల్ ట్రీట్


SDT18 మేకింగ్ వీడియో కళ్లు చెదిరే విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ కథాంశంతో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. ‘ఆర్కాడీ ప్రపంచలోకి స్వాగతం...” అంటూ చూపించిన ఈ వీడియో ఆహా అనిపిస్తోంది. సాయి దుర్గ తేజ్ తొలిసారిగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఈ హై ఆక్టేన్, పీరియడ్ యాక్షన్ డ్రామాలో తన మార్క్ నటనతో ఆకట్టుకోబోతున్నది. ఈ సినిమాలో సాయి ఫిట్ నెస్ మరో లెవెల్ లో కనిపిస్తోంది. ఈ మూవీ కోసం ఆయన తన బాడీని మరింతగా పెంచుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ వీడియో జస్ట్ బిగినింగ్ అంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు సినిమా మరెలా ఉంటుందోనని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఈ మేకింగ్ వీడియో ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచుతోంది.    



పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న SDT18


అటు ‘విరూపాక్ష’, ‘బ్రో’ లాంటి హిట్ చిత్రాలతో ఫుల్ జోష్ లో కొనసాగుతున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు SDT18 అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమానూ తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్‌  సంస్థపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో భాషల్లో విడుదలకానుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.



యాక్సిడెంట్ తర్వాత రెండు హిట్ చిత్రాలు


హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి మీద బైక్ స్కిడ్ అయి కోమాలోకి వెళ్లిన సాయి దుర్గ తేజ్ కొద్ది రోజుల పాటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. కొద్ది కాలం పాటు రెస్ట్ తీసుకున్న ఆయన, ‘విరూపాక్ష’ సినిమా చేశారు. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే ఊపులో మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం SDT18 అనే ప్రతిష్టాత్మక చిత్రంతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు.


Also Readచిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?