తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ నేడు తుది శ్వాస విడిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ 'అడివి రాముడు' నిర్మాతలలో ఆయన ఒకరు.


మరణాన్ని ముందే ఊహించిన సూర్యనారాయణ!?
నిర్మాత సూర్యనారాయణ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. వయసు రీత్యా శరీరం ఆయనకు సహకరించలేదు. అందువల్ల, ఇంటి నుంచి బయటకు కదల్లేదు. వీల్ ఛైర్ కు పరిమితం అయ్యారు. ఆఖరికి మనవరాలి వెడ్డింగ్ రిసెప్షన్ కు సైతం హాజరు కాలేదు. కొన్ని నెలలు క్రితమే ఆయన తన మరణాన్ని ఊహించారని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. మానసికంగా ప్రిపేర్ అయ్యారట. 


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే?



గతేడాది (2022) డిసెంబర్ నెలలో నటులు కైకాల సత్యనారాయణ, చలపతి రావు, వల్లభనేని జనార్ధన్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ బాధను దిగమింగుతూ... కొత్త ఏడాదిలో అంతా బావుండాలని 2023లోకి టాలీవుడ్ అడుగుపెట్టింది. తొలి వారంలో ఓ మరణం చోటు చేసుకుంది. సీనియర్ సినిమా జర్నలిస్ట్, గేయ రచయిత పెద్దాడ మూర్తి (Peddada Murthy) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా జనవరి 3వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. 


పెద్దాడ మూర్తి స్వస్థలం భీముని పట్నం. ఆయన తండ్రి వీరభద్రరావు నుంచి వారసత్వం అందుకుని సాహిత్యం వైపు అడుగులు వేశారు. విశాఖపట్టణంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో విలేకరిగా ప్రయాణం ప్రారంభించారు. తర్వాత పలు పత్రికల్లో పని చేశారు.


పెద్దాడను లిరిసిస్ట్ చేసిన తమ్మారెడ్డి!
సినిమా జర్నలిస్టుగా ఉన్న పెద్దాడ మూర్తిని చిత్ర పరిశ్రమకు గేయ రచయితగా పని చేసిన వ్యక్తి మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెరకెక్కించిన 'కూతురు' చిత్రంలో ఓ గీతాన్ని రాసే అవకాశం ఇచ్చారు. పలు సీరియళ్లకు కూడా పెద్దాడ మూర్తి పాటలు రాశారు. 


గుర్తింపు తెచ్చిన 'చందమామ', 'స్టాలిన్'
కాజల్ అగర్వాల్, నవదీప్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన 'చందమామ' సినిమా పెద్దాడ మూర్తికి ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమాలో 'బుగ్గే బంగారమా...' పాటను రాశారు. అయితే, మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'స్టాలిన్' సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' పాటను మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన మాటలు, పాటలు అందించిన 'నాగలి' సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. హైదరాబాద్, రాజీవ్ నగర్ శ్మశాన వాటికలో బుధవారం పెద్దాడ మూర్తి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన సోదరుడు పీవీడీఎస్ ప్రకాష్ గత ఏడాది కాలం చేశారు. ఆయన కూడా రచయిత, లిరిసిస్ట్. వరుస మరణాలతో పెద్దాడ మూర్తి కుటుంబంలో విషాదంలో మునిగింది.  


Also Read : అఖిల్‌పై మనసు పారేసుకున్న పెళ్ళైన హీరోయిన్


డిసెంబర్ 29, 2022లో మరణించిన వల్లభనేని జనార్ధన్ విషయానికి వస్తే... ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని పోతులూరు. విజయవాడ లయోలా కాలేజీలో చదివారు. సినిమాలపై ఆసక్తితో పరిశ్రమకు వచ్చారు. నటుడిగా, దర్శక నిర్మాతగా పలు చిత్రాలు చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ్ బాపినీడుకు ఆయన అల్లుడు. బాపినీడు మూడో కుమార్తె లళినీ చౌదరితో జనార్ధన్ వివాహం జరిగింది. జనార్ధన్, లళిని దంపతులకు ముగ్గురు సంతానం. ముగ్గురిలో ఓ అమ్మాయి చిన్నతనంలో మరణించారు. మరో అమ్మాయి అభినయ ఫ్యాషన్ డిజైనర్. అబ్బాయి అవినాశ్ అమెరికాలో ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. నటుడు చలపతి రావు ప్రయాణం గురించి ప్రేక్షకులకు తెలిసిందే. ఎన్టీఆర్ మద్దతుతో నటుడిగా ఎదిగి, తర్వాత అందరితో సినిమాలు చేశారు.