Samantha | క్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), సమంత(Samantha) విడాకులు ఎంతగా చర్చనీయమైందో తెలిసిందే. వారిని జంట చూసేందుకు ఇష్టపడే అభిమానులు మనసు కూడా ముక్కలైంది. వారి విడాకులపై మొదట్లో వచ్చిన వార్తలను పుకారులనే అనుకున్నారు. కానీ, వారే స్వయంగా తాము విడిపోతున్నామని చెప్పడంతో అంతా షాకయ్యారు. సామ్ - చైతూ విడిపోవడానికి గల కారణాలైతే ఎవరికీ తెలీదు. కానీ, విడాకుల తర్వాత సమంతాయే ఎక్కువ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. అది వారి వ్యక్తిగత నిర్ణయమైనా.. కొందరు ఆమెనే లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ తట్టుకుంటూ సామ్ కొత్త ప్రయాణానికి మార్గం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైంది. చైతూ కూడా వరుస చిత్రాలు, వెబ్ సీరిస్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. 


సామ్-చైతూ విడిపోయినా పెళ్లినాటి మధుర జ్ఞాపకాలు వారిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే సమంత మరో ఊహించని నిర్ణయం తీసుకుంది. పెళ్లి రోజు కట్టుకున్న చీరను నాగ చైతన్యకు తిరిగి పంపించిందని తెలిసింది. ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. పెళ్లి రోజు సమంతా కట్టుకున్న చీర, అక్కినేని ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్. ఎందుకంటే, అది చైతూ నానమ్మ కట్టుకున్న చీర. విడాకుల తర్వాత అంత విలువైన చీరను తన వద్ద ఉంచుకోవడం న్యాయం కాదని భావించిన సమంత, దాన్ని అక్కినేని ఫ్యామిలికి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే, ఈ దీనిపై అక్కినేని కుటుంబం నుంచి గానీ, సమంత సన్నిహిత వర్గాలు గానీ ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించలేదు.


Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!


ప్రస్తుతం సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఆమె నటించిన ‘శకుంతలం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి, నయన తారతో కలిసి నటించిన చిత్రం తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజా’గా విడుదల అవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కన్మణి పాత్రలో నయనతార (Nayanthara), ఖతీజా పాత్రలో సమంత (Samantha) నటిస్తోంది. ప్రస్తుతం సామ్ ‘యశోద’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. 




Also Read: ఆ ప్రేమకథ ఎప్పటికీ ఎండ్ అవ్వకూడదని కోరుకుంటున్న సమంత