ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ సమంత-చైతూ విడాకులు. అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజునే వారిద్దరూ తాము విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు.  ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఖాతాల్లో ఆ విషయాన్ని పోస్టు చేశారు. ఆ పోస్టులు పెట్టిన కాసేపటికే హీరో సిద్ధార్ధ ఓ ట్వీట్ చేశారు... ‘చిన్నప్పుడు స్కూల్లో టీచర్ దగ్గర నేను మొదట నేర్చుకున్న విషయం... మోసగాళ్లు ఎప్పుడూ బాగు పడరు అని... మరి మీరు?’ అన్నది ట్వీట్ సారాంశం. దీని వెనుక చాలా అర్థాలను వెతికారు నెటిజన్లు. ఆ ట్వీట్ సమంతను ఉద్దేశించేనని అభిప్రాయపడ్డారు. చైతూ కన్నా ముందు సిద్ధార్ధ్ తోనే ప్రేమలో ఉంది సామ్. అతని కోసం చాలా పూజలు చేసింది. హఠాత్తుగా ఓ రోజు విడిపోయింది. ఆ తరువాత చైతూతో ప్రేమ, పెళ్లి అయిపోయాయి. 


కాగా సిద్ధార్ధ్ పెట్టిన ట్వీట్ కు పంజాబీ పిల్ల పూనమ్ కౌర్ స్పందించి. అతని ట్వీట్ ను రీట్వీట్ చేసి ‘అది నిజమే’ అని క్యాప్షన్ పెట్టింది. అసలే పోసాని- పవన్ కళ్యాణ్ మధ్య గొడవలో పూనమ్ టాపిక్ చాలా హాట్ గా మారింది. ఆమె పేరు చెప్పకుండా ఓ పంజాబీ అమ్మాయిని మోసం చేశారని, గర్భవతిని చేసి, అయిదు కోట్లు ఇచ్చి అబార్షన్ చేయించారని ఇలా చాలా వ్యాఖ్యలు బయటికి వచ్చాయి. ఆ పంజాబీ అమ్మాయి పూనమ్ అని చాలా మంది అభిప్రాయం. ఇలాంటి నేపథ్యంలో పూనమ్, సిద్ధార్ద్ ట్వీట్ కు ఆ విధంగా స్పందించడంపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు. 



సామ్-చై విడాకులపై బాలీవుడ్ నటి కంగనా కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె మాత్రం తప్పంతా ఆమిర్ ఖాన్ మీదకు నెట్టేసింది. కొన్ని రోజుల క్రితం చైతూ ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, వెంటనే భార్యకు విడాకులిచ్చాడంటూ పోస్ట్ పెట్టింది.  


Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?


Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..


Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి