టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సాయిపల్లవి. యూత్ లో ఆమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె పెర్ఫార్మన్స్ కి, డాన్స్ కి కుర్రకారు ఫిదా అయిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా ఈ బ్యూటీ కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది. దీంతో నెటిజన్లు, కొందరు రాజకీయనాయకులు సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై సాయిపల్లవి వివరణ ఇస్తూ.. ఓ వీడియోను షేర్ చేసింది. 


ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు..? అబ్బాయిల్లో ఆమె చూసే క్వాలిటీ ఏంటి..? అనే విషయాలను బయటపెట్టింది. అబ్బాయిలు ఇలానే ఉండాలనే రూల్ తనకు లేదని.. కాకపోతే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలంటే తనకు ఇష్టమని చెప్పింది. వాళ్లు మనస్ఫూర్తిగా ఫీలై ఏదైనా చెబితే ఇష్టమని.. ఏదైనా ఇష్యూపై వెంటనే స్పందించి ఏడిస్తే అనచ్చుతారని తెలిపింది. 


మ్యాచోగా ఉంటే తనకు నచ్చదని.. అమ్మాయిలు హర్ట్ అవ్వకూడదని అబ్బాయిలు చేసే కొన్ని ప్రయత్నాలు, త్యాగాలు బాగా నచ్చుతాయని చెప్పింది. ఇలా తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారో చెప్పేసింది సాయిపల్లవి. అలానే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చాలా మంది బాడీ పెంచుతుంటారని.. అలా బాడీ పెంచేవారు తనకు నచ్చరని తెలిపింది. అబ్బాయిలు ఫిట్ గా ఉంటే సరిపోతుందని.. భారీగా శరీరాన్ని పెంచాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'విరాటపర్వం' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. 


Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది


Also Read: 'విక్రమ్', 'మేజర్' వల్లే అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ప్లాప్ అయ్యిందా? హీరోయిన్ మాటలు విన్నారా?